ఆరోగ్యం
ఘుమ ఘుమ లాడే టీ రుచుల్లో క్యాన్సర్ కారకాలు..?

కర్ణాటకలో పలుచోట్ల టీ నమూనాలను సేకరించి, ల్యాబ్లో టెస్ట్ చేయగా.. అందులో 71 శాంపిల్స్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అదే రాష్ట్రంలో కాలీఫ్లవర్, మంచూరియన్, పీచు మిఠాయి వంటి వాటిల్లో ఉపయోగంచే రంగుల మీద కూడా FSSAI షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ రంగులు అత్యంత విషపూరితమైనవని, వీటివల్ల క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వంటి రోగాలువచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.
కర్ణాటకలోని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారి ఇటీవల ఓ కారులో దొరికిన టీ ఆకుల నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్లో టెస్ట్ చేయగా అందులో దుమ్ము, పురుగుమందులు, రంగులు కనుగొనబడ్డాయి. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. ఉత్తర కర్ణాటక నుంచి దాదాపు 50 శాంపిల్స్ తీసుకోగా టీ ఆకుల తయారీలో పెద్ద మొత్తంలో పురుగుమందులు వాడినట్లు తేలిందని చెప్పారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోడమైన్-బి, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు తేయాకు ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఇది ప్రమాదకర సంకేతం.
నిపుణులు ఏమంటున్నారంటే ?
టీ ప్రాసెసింగ్ సమయంలో రోడమైన్ బి, కార్మోసన్ ఫుడ్ కలర్స్ కలుపుతారని ఢిల్లీలోని ధర్మశాల ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అంగ్షుమన్ చెప్పారు. ఈ రకమైన టీ తాగడం వల్ల శరీరంలో జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వినియోగం క్యాన్సర్కు కారణం కావచ్చు. రోడమైన్ బి అనేది క్యాన్సర్కు కారణమయ్యే రసాయనం. అలాగే చాలా మంది పాలతో చేసిన టీని ఇష్టపడతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కానీ ప్రతిరోజూ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం ఖాళీ కడుపుతో పాల టీ తాగడం వల్ల జీవక్రియ బలహీనపడుతుంది. దీనిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, ఇతర పొట్ట సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే టీలో కెఫీన్ ఉంటుంది. ఇది రాత్రిపూట మన నిద్ర వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమి కలుగుతుంది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక