Connect with us

ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు పక్కన పెట్టి ప్రజాసంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి… మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

Published

on

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం

కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు పక్కన పెట్టి ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసిపి మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు

చంద్రబాబు ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి ఉచిత ఇసుక పేరుతో నియోజకవర్గంలో పెరిగిపోయిన టీడీపీ నాయకులు దోపిడీలు

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ఉత్తర ప్రగల్బాలు తప్ప ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమి లేవు.

రైతుభరోసా, రైతులకు రబి సీజన్ ధాన్యం డబ్బులు, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఉచిత సీలిండర్లు, మహిళలకు 1500, ఉచిత బస్సు ప్రయాణం తదితర పధకాలు ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తేదీ, సమయం చెప్పి చేసే దమ్ము టీడీపీకి ఉందా…?

తిమ్మిని బమ్మిని చేసి, అబద్దాలను నిజాలుగా ప్రపంచ ప్రచారం చేసే మెళకువలు అన్ని మెండుగా తెలిసిన చంద్రబాబు నాయుడు నిత్యం జగన్మోహన్ రెడ్డి పై గత ప్రభుత్వంపై శ్వేతపత్రాల పేరుతో ప్రచారాలు చెయ్యడం తప్ప, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారని చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు.

ఈ మేరకు మంగళవారం రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తాం అని గొప్పలు చెప్పిన జిత్తులమారి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉందని మొసలి కన్నీరు కార్చడం, గత మా ప్రభుత్వ హయాంలో జరిగిన ఎంఓయులు వీళ్ళ హయాంలో జరిగిపోతున్నట్టు ప్రచారాలు చేసుకోవడం, ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకుల దోపిడీ దండాలు మితిమీరి పోతున్నాయని అన్నారు.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తేదీ, సమయం ముందుగానే చెప్పి ప్రతీ పధకం అర్హులైన అందరికీ అందించారని, అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

తల్లికి వందనం పేరుతో ప్రతీ విద్యార్థికి 15 వేల రూపాయలు ఇస్తామని మరలా వారే ప్రతీ తల్లికి అని మాట మారుస్తున్నారని, ప్రజల పక్షాన నిలబడి వైసీపీ ప్రశ్నించడంతో ఇప్పుడు మరలా మాట మార్చి ఇంకా విధివిధానాలు ఖరారు చెయ్యలేదు అని, ప్రతీ విద్యార్థికి అందిస్తామని చెప్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు మేము పోరాడతామని తెలియచేశారు.

రైతులకు రబీ సీసన్ ధాన్యం డబ్బులు నియోజకవర్గంలో 45 కోట్ల రూపాయలు పైనే బకాయిలు ఉన్నాయని, 3 నెలలు గడిచినా వారికి డబ్బు వేయలేదని ఎన్నికల పేరుతో ఆపిన చెల్లింపులు ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పైనే అయినా ఇంకా వెయ్యకపోవడం బాధాకరం అని అన్నారు.

ఉచిత ఇసుక అంటూ సామాన్యులకు అందుబాటులో ఇసుక ఉంచుతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటైతే, కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నాయకులు తీరు దోపిడీకి పరాకాష్టగా ఉందని అన్నారు. మల్లయ్యదొడ్డి వద్ద స్టాక్ రీచ్ నందు స్థానిక లారీలకు 300, ఇతర ప్రాంతాల లారీలకు 500 చొప్పున టీడీపీ బ్రోకర్లు వసూళ్ళు చేస్తున్నారని, జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ మొదట వచ్చినా వై.సి.పి వారి వాహనాలకు ఇసుక వేయకుండా అడ్డుకుంటున్నారని,

పూరేటి వారి చెరువు వద్ద స్టాక్ పాయింట్ వద్ద అమరావతి, విశాఖపట్నం లలో ప్రభుత్వ పనులకు ఇసుక పంపుతున్నాం అని చెప్పి స్థానిక వాహనాలను లోపలికి రానీయకుండా అడ్డుకుని, బయట వాహనాల వద్ద నుండి 10 వేల రూపాయలు అనధికారికంగా వసూలు చేస్తున్నారని, ఈ స్టాక్ పాయింట్ లోకి కూడా స్థానిక వాహనాలు అనుమతించాలని, అలాగే గతంలో ఇసుక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే అందించినా చంద్రబాబు నాయుడు , స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు సెల్ఫీల పేరుతో అసత్యప్రచారాలు చేశారని, ఇప్పుడు వారు వచ్చి ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర వారి బ్రోకర్లు వసూళ్లు చేస్తున్న డబ్బు పక్కన పెట్టుకుని సెల్ఫీ దిగాలని సవాల్ చేశారు.

ఈ పద్ధతి మార్చుకోకపోతే స్థానికులకు న్యాయం జరిగేలా మేమే స్టాక్ రీచ్ లకు వెళ్లి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ముందు వచ్చిన వాహనాలకు ముందు ఇసుక ఇచ్చి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580225
Total Users : 47909