జాతీయం
ముంబైలో ప్రారంభించిన మొదటి భూగర్భ మెట్రో రైల్

ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణ కు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ఈరోజు ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు.
మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది.
ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- SIPZ లైన్ అని కూడా పిలుస్తారు. దీని పని 2017లో ప్రారంభమైంది. ఈ మార్గంలో ముంబై మెట్రో ఆరే కాలనీ నుండి కఫ్ పరేడ్ వరకు 27 స్టేషన్ల మధ్య నడుస్తుంది.
రైలు కఫ్ పరేడ్, విధాన్ భవన్, చర్చ్గేట్, హుతాత్మా చౌక్, CST మెట్రో, కల్బాదేవి, గిర్గావ్, గ్రాంట్ రోడ్, ముంబై సెంట్రల్ మెట్రో, మహాలక్ష్మి, సైన్స్ మ్యూజియం తోపాటు…
ఆచార్య ఆత్రే చౌక్, వర్లీ, సిద్ధివినాయక్, దాదర్, సీతాలాదేవి, ధారవి, శాంతా, విద్యానగరి క్రజ్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, సహర్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోల్ నాకా, MIDC, SEEPZ , ఆరే డిపో స్టేషన్స్ లో పరుగులు పెడుతుంది.
ఇక ఈ మెట్రో సర్వీసు సమయాలు ఉదయం 6:30 నుండి రాత్రి 11:00 గంటల వరకు ఉంటాయి. మెట్రో మార్గంలో ప్రతి కొన్ని నిమిషాలకు రైళ్లు నడుస్తూనే ఉంటాయి. రైళ్లు గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.
దీని కారణంగా 35 కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణం దాదాపు 50 నిమిషాల్లో పూర్తవుతుంది. రోడ్డు మార్గంలో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక