ఆంధ్రప్రదేశ్
ఏపీలో శాంతిభద్రతల తక్షణం పునరుద్ధరించండి – తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను తక్షణం పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్సభలో సోమవారం ప్రత్యేక అధికరణ 377 కింద తిరుపతి ఎంపీ ఈ విషయాన్ని లేవనెత్తారు.
ఎంపీ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. జెడ్ సెక్యూరిటీ భద్రతకు అర్హులైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన రక్షణ కల్పించడంలో విఫలమైందని సభ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు జెడ్ సెక్యూరిటీకి బదులు 4+4 సెక్యూరిటీ మాత్రమే కేటాయించారని ఆయన అన్నారు.
2019, 2024లో తమ నాయకుడు జగన్పై దాడులు జరిగిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఇప్పటికైనా వైఎస్ జగన్కు తగిన భద్రత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలను చట్టాన్ని అమలు చేసే సంస్థలు అడ్డుకుంటున్నాయని గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఎంపీలు, మాజీ ఎంపీలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ఎంపీలు, మాజీ ఎంపీలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయని ఎంపీ తెలిపారు.
ఏపీలో తక్షణం శాంతిభద్రతలను పునరుద్ధరించాలని, చట్టబద్ధమైన పాలనను నెలకొల్పాలని ఆయన కోరారు. అలాగే పౌరులందరి భద్రతను కాపాడాలన్నారు. విభిన్న రాజకీయ విశ్వాసాలను కలిగిన నాయకులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడుల్ని అరికట్టాలన్నారు. ఈ మేరకు హోం, పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హృదయపూర్వకంగా డాక్టర్ గురుమూర్తి అభ్యర్థించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68058