ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో బీ-టాక్స్ పేరుతో కొత్త టాక్స్ ధ్వజమెత్తిన చిర్ల జగ్గిరెడ్డి

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
*ఇసుక స్టాక్ పాయింట్లలో బీ-టాక్స్ పేరుతో కొత్త దందా*
*బండారు టాక్సా? బాబు టాక్సా? ప్రజలకు తెలియాలి*
*కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్*
జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధివిధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెరతీశారని చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు
ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూరేటి వారి చెరువు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వై.సి.పి శ్రేణులు, లారీ ఓనర్లతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ ఇసుక విధానాన్ని అమలు చేసి, వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఇసుక అందుబాటులో ఉండాలని స్టాక్ యార్డులలో ఇసుకను ఉంచితే ప్రస్తుత ముఖ్యమంత్రి సెల్ఫీల పేరుతో నానా హంగామా చేసి, ఏ విధమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ J-టాక్స్ అంటూ హడావిడి చేసారని,ఇప్పుడు మీరు చేస్తున్న B-టాక్స్ దందా గురించి మేము చెప్పట్లేదని మీ జేబు పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో పతాక శీర్షికలలోనే రాస్తున్నారని అన్నారు.
చంద్రబాబు నాయుడు, సత్యానందరావు ఇసుక స్టాక్ దగ్గర సెల్ఫీలు దిగితే ఎందుకో అనుకున్నాం అని, ఆ ఇసుక ఎంత ఉందో చూసి B-టాక్స్ వసూలు చేసి అమ్మేసుకోడానికి అని ఇప్పుడే అర్థం అవుతుంది అని ఎద్దేవా చేశారు.
స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలని జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ముందు వచ్చిన వారికి ముందు ఇసుక ఇవ్వాలనే నిబంధనలను పాటించకుండా, ఇసుక లారీకి బిల్లు ఇచ్చేది 4900, కానీ వసూలు చేసేది 11,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిలో 6100 పైనే స్థానిక నాయకుల జేబులోకి వెళ్తుంది అని ఆంధ్రజ్యోతి పేపర్ లొనే రాశారని అన్నారు.
ఆలమూరు మండలానికి చెందిన ఒక టీడీపీ వీరాభిమాని సాక్ష్యాత్తూ నారా లోకేష్ కే సామాజిక మాధ్యమాల వేదికగా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారని అన్నారు.
ప్రస్తుత నీటిపారుదల శాఖా మంత్రివర్యులు ఎన్నికల ప్రచారం సందర్భంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ మహిళా సోదరీమణుల దగ్గర ఉదరగొట్టారని, అది అమలులో లేదు కానీ ఇసుక కోసం వచ్చిన లారీల దగ్గర నీ దగ్గర 11,000 నీ దగ్గర 11,000 చొప్పున వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి ఈ స్టాక్ యార్డుల దగ్గర జరుగుతున్న దందాల గురించి కూడా సెల్ఫీలు తీసుకోవాలని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న లారీ డ్రైవర్లు మాట్లాడుతూ మేము ఇక్కడికి వచ్చి లారీ లైన్లో పెట్టి 6 రోజులు అయింది అని, ఇప్పటికీ ఇసుక ఇవ్వలేదని ఆర్ధికంగా చాలా నష్టపోతున్నామని వాపోయారు.
ఈరోజు మేము వస్తున్నామని లోడింగ్ ఆపేశారని,ఇదే పరిస్థితి కొనసాగి స్థానికులకు పార్టీల పేరుతో వివక్ష చూపుతూ ఉంటే ఎప్పుడు లోడింగ్ ప్రారంభించినా వచ్చి ఇక్కడే రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక