ఆంధ్రప్రదేశ్
వరదలు తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం కోత్తపేట ఎమ్మెల్యే బండారు హామీ

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
అన్నదాతలపై పకృతి వైపరీత్యాలు కన్నెర్ర చేస్తున్నాయని, ఇటీవల కాలంలో సంభవించిన వరుస తుఫాన్లు వరదల వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని పంటను కోల్పోయిన రైతులు అందర్నీ ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల లంక భూముల్లో గల పంటలను గోదావరికి సంభవించిన వరద ముంచెత్తడంతో దెబ్బతిన్న పంట పొలాలను స్థానిక నాయకులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావంతో పంట నష్టపోయిన స్థానిక రైతుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్ట వివరాలను సేకరించాలని, నష్టపోయిన ఏ రైతు కంటతడి పెట్టరాదని, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్ట నమోదును సేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలైన బొప్పాయి, జామ, కూరగాయలు, పూ తోటలు, అరటి పంటలకు వరదల వలన భారీ నష్టం ఏర్పడిందని రైతులు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు అధికారులు రైతులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక