Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి రైతులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా -తిరుపతి ఎంపీ గురుమూర్తి

Published

on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు, వినియోగదారులకు కొబ్బరి వివిధ కొబ్బరి ముడి భాగాలతో హస్తకళల శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిందా అలా అయితే జిల్లాల వారీగా గత మూడేళ్లలో నిర్వహించిన శిక్షణ వివరాలు తెలుపగలరు అలాగే ఈ హస్తకళలకు సంబంధించి రాష్ట్రంలో ఏదైనా ప్రదర్శనలు నిర్వహించిందా ఆలా అయితే దాని వివరాలు తెలుపగలరు అంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంటులో ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ సమాధానమిస్తూ

కొబ్బరి మొక్క యొక్క వివిధ భాగాలతో ఆకర్షణీయమైన వస్తువుల తయారీని ప్రోత్సహించడానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న కొబ్బరి అభివృద్ధి బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి హస్తకళల శిక్షణను నిర్వహించిందని తెలియజేసారు. నిరుద్యోగుల కోసం ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని యువతకు ఉపాధి అవకాశాలు మరియు జీవనోపాధిని అందించడానికి కొబ్బరి కోత మరియు ఇతర సస్యరక్షణ కార్యకలాపాలకు నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రోత్సహించడానికి బోర్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ కోకోనట్ ట్రీ వంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలలో నిర్వహించిన శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వివరాలు పరిశీలించినట్లయితే 2022-23 సంవత్సరాలలో చిత్తూరు జిల్లా కలికిరిలో ఒక శిక్షణ కార్యక్రమం ద్వారా 20 మందికి శిక్షణ మరియు 2023-24 మన్యం జిల్లా పార్వతీపురం, కోనసీమ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నాలుగు శిక్షణా కార్యక్రమాల ద్వారా 75 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేసారు

మంచి వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ కొబ్బరి సాగు, సస్యరక్షణ కార్యకలాపాలు, ప్రాసెసింగ్, మరియు మార్కెటింగ్‌పై విస్తరణ కార్యకలాపాలలో భాగంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు క్రమం తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు మరియు పారిశ్రామికవేత్తలకు అవగాహన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుందని 2021 నుండి 2024 వరకు మొత్తంగా 35 అవగాహనా కార్యక్రమాల ద్వారా 1578 మందికి శిక్షణ ఇచ్చామని తెలియజేసారు.

కొబ్బరి ఉత్పత్తులపై అవగాహన కల్పించడానికి మరియు కొబ్బరి పోషక మరియు ఆరోగ్య గుణాలను ప్రోత్సహించడానికి వినియోగదారులు మరియు ఇతర వాటాదారులతో బోర్డు నిర్వహించిన ప్రదర్శనలు, సెమినార్లు విషయానికి వస్తే 2021 నుండి 2024 వరకు గుంటూరులో 3 ప్రదర్శనలు, బాపట్లలో ఒక ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పో నిర్వహించినట్లు తెలియజేసారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580210
Total Users : 47894