ఆంధ్రప్రదేశ్
పార్లమెంటులో రైల్వే బడ్జెట్ చర్చ ; రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై గళమెత్తిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

Delhi;
నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ చర్చలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలను గౌరవ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివరాలలోకి వెళ్తే పరిశీలించినట్లయితే
• విశాఖపట్నం కేంద్రంగా “సౌత్ కోస్ట్ రైల్వే జోన్” ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలి.
• లోడింగ్, అన్లోడింగ్ జరిగే స్టేషన్లలో రైల్వే కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు కల్పించాలని, విజయనగరం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, గూడూరు మరియు ప్రధాన స్టేషన్లలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల కల్పనకు మరింత వనరుల కేటాయించాలి.
• ఆంధ్రప్రదేశ్లో రైల్వే రిక్రూట్మెంట్ జోన్ను ఏర్పాటు చేయాలి.
• కోవిడ్ కి ముందు సమయాల్లో ఉన్న రైల్వే స్టాప్లను పునరుద్ధరించాలి.
• దయనీయంగా ఉన్న జనరల్ కంపార్ట్మెంట్లను పునరుద్ధరించి కంపార్ట్మెంట్ల సంఖ్యను పెంచే చర్యలు తీసుకోవాలి.
• సీనియర్ సిటిజన్లు మరియు అక్రెడిటేడ్ జర్నలిస్టులకు ఇచ్చిన రాయితీలను పునరుద్ధరించి పొడిగించాలి.
• రేణిగుంట రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ చేసేందుకు 200 కోట్లతో డిజైన్ చేయబడిన డీపీఆర్ త్వరగా ఆమోదించాలి.
• ఇప్పటికే మంజూరైన కడప బెంగుళూరు లైన్ అభివృద్ధిని వేగవంతం చేయాలి.
• శ్రీకాళహస్తి, తిరుపతి రైల్వేస్టేషన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తూ అమృత్ భారత్ పథకం క్రింద కలికిరి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలి.
• రేణిగుంట-గూడూరు మధ్య 3వ లైన్ను కూడా త్వరగా మంజూరు చేయాలి.
• తిరుపతి నుండి మైసూరు వరకు వందేభారత్ రైలు ఏర్పాటు, తిరుపతి నుండి షిర్డీకి ప్రతిరోజూ రైలు సర్వీసు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా అభ్యర్థన.
• ఆలయ పర్యాటకాని ప్రోత్సహిస్తూ భక్తుల రద్దీని సులభతరం చేయడానికి ఆలయ పట్టణాలైన తిరుపతి- అయోధ్య మరియు వారణాసిని కలుపుతూ ప్రత్యేక రైలు సర్వీసు కోసం వినతి.
• నాయుడుపేట రైల్వేస్టేషన్లో నవజీవన్ ఎక్స్ప్రెస్ను అలాగే వెండోడు రైల్వే స్టేషన్లో కృష్ణా, పూరీ ఎక్స్ప్రెస్లను ఆపవలసినదిగా వినతి.
• నందలూరు లోకో షెడ్ను మెరుగుపరచడంతోపాటు రాజంపేట, కోడూరు, ఓబులవారిపల్లి మరియు నందలూరు స్టేషన్లలో కోవిడ్కు ముందు ఉన్న అన్ని రైలు స్టాపేజ్లను పునరుద్ధరించవలసినదిగా కోరుతూ రైల్వే బడ్జెట్ పై తిరుపతి ఎంపీ గురుమూర్తి తన చర్చను ముగించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక