Connect with us

ఆంధ్రప్రదేశ్

హెల్త్ బడ్జెట్‌ నిధులు పెంచండి – తిరుపతి ఎంపీ గురుమూర్తి

Published

on

Delhi:-

*మంగళగిరి ఎయిమ్స్ కి తగినన్ని నిధులు ఇవ్వండి*

*స్విమ్స్ ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన వైద్య సంస్థగా గుర్తించండి*

*శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హోదా కల్పించాలి*

*హెల్త్ బడ్జెట్ లో కేంద్రం ముందు పలు ప్రతిపాదనలు చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి*

పార్ల‌మెంట్‌లో హెల్త్ బ‌డ్జెట్‌పై తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌సంగించారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రధాన వైద్య సంస్థ అని అన్నారు. ఇది 2018లో స్థాపించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ సంస్థ నిర్వహణ, విస్తరణకు అవసరమైన నిధుల కొరతతో ఉందని ఎంపీ తెలిపారు. ఎయిమ్స్‌లో ఉన్నత స్థాయి వైద్య నిపుణులు, పరిశోధకులను ఆకర్షించ‌డానికి నిధుల కొర‌త అడ్డంకిగా మారింద‌ని గురుమూర్తి తెలిపారు.

అలాగే తిరుప‌తి స్విమ్స్ 1993లో త‌న సేవ‌ల‌ను ప్రారంభించినట్టు గురుమూర్తి తెలిపారు. 30 ఏళ్ల కాలంలో ప్ర‌ముఖ హెల్త్‌కేర్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌గా స్విమ్స్ స్థిర‌ప‌డిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక్క‌డ వైద్యానికి వ‌చ్చే రోగుల్లో సుమారు 95 శాతం మంది సామాజిక‌, ఆర్థికంగా వెనుక‌బ‌డిన నేప‌థ్యం గ‌ల‌వారే అని ఆయ‌న అన్నారు. స్విమ్స్ విశ్వవిద్యాలయాన్ని జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థగా (ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) గుర్తించాలని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023, ఆగ‌స్టులో కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిందన్నారు. వాటిని పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని పరిశీలించి ఆర్థిక సహాయాన్ని, ఎయిమ్స్ కి మరో 10 ఎకరాల భూమిని, స్విమ్స్ విశ్వవిద్యాలయానికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా హోదాను అందించాలని ఆయ‌న కోరారు.

*ప్రధాన మంత్రి స్వ‌స్థ‌ సురక్ష యోజనకు త‌గ్గిన నిధులు*

ప్రధాన మంత్రి స్వ‌స్థ‌ సురక్ష యోజన పథకానికి నిధుల కేటాయింపులు తగ్గించడం ఆందోళన క‌లిగిస్తోంద‌ని తిరుప‌తి ఎంపీ గురుమూర్తి తెలిపారు. 2022-23 సంవత్సర బడ్జెట్ రూ.7517 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపు రూ.2200 కోట్లు మాత్రమే ఉందని స్పీక‌ర్ దృష్టికి ఆయ‌న తీసుకెళ్లారు. దీంతో తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య విద్యలో ప్రాంతీయ అసమతుల్యతలను సరిదిద్దాలనే ప్రాథమిక లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అన్నారు. *ఇతర ప్రధాన సంస్థలలాగే స్విమ్స్ విశ్వవిద్యాలయానికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించి హోదా ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ సంస్థ తన అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన సామాజిక-ఆర్థిక నేపథ్యాలు కలిగిన రోగులకు సేవలను విస్తరించగలదని ఆయ‌న అన్నారు.

*మానసిక ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు సరిపోదు*

నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కోసం ప్రస్తుత బడ్జెట్ లో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని, కేవలం ₹90 కోట్లు కేటాయించడం బాధాకరమని ఎంపీ పేర్కొన్నారు. గత బడ్జెట్ కంటే పెరుగుదల స్వల్పంగా ఉందన్నారు. కోవిడ్ తరువాత దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ బడ్జెట్ కేటాయింపులు సరిపోవని అన్నారు.

*కేటాయించిన మూలధన వ్యయం సరిపోదు*

వైద్య, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం కేటాయించిన మూలధన వ్యయం సరిపోదని తిరుప‌తి ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఈ రంగానికి కేవలం ₹3510.49 కోట్లు కేటాయించడం ఆందోళనకరం అని ఆయ‌న అన్నారు. ఈ పరిమిత నిధులు కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, ప్రస్తుత ఆరోగ్య అవసరాలను తీర్చడానికి అవసరమైన సౌకర్యాలను పెంపొందించడానికి చేసే ప్రయత్నాలకు విఘాతం అని అన్నారు. 2020 సంవత్సరంలో, బ్రెస్ట్, గర్భాశయ, నోటి కుహరం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సుమారు 8.5 లక్షల మరణాలు నమోదయ్యాయని స‌భ దృఫ్టికి తెచ్చారు. భారతదేశంలో క్యాన్సర్ కారణంగా మరణాలు రేటు గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.

ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్‌ చేసుకొనే సౌలభ్యత లేదని అన్నారు. తిరుపతి స్విమ్స్ సహకారంతో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఫిబ్రవరి 2024లో రెండు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌లను ప్రారంభించామ‌న్నారు. సుమారు 60 వేల మందికి వైద్య ప‌రీక్ష‌లు చేయించిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. అందులో 850 కేసులు పాజిటివ్‌గా గుర్తించి కేన్సర్‌ కేంద్రానికి రెఫర్ చేశార‌న్నారు. ప్రధానంగా హెచ్.పి.వి ఇన్ఫెక్షన్ కారణంగా భారతదేశంలోని మహిళల్లో వచ్చే ప్రధాన క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటన్నారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో హెచ్‌పివికి వ్యతిరేకంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, ఇమ్యునైజింగ్ కోసం మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఇమ్యునైజింగ్ యూనిట్లను ప్రారంభించడానికి తగిన వనరులను కేటాయించాల్సిన అవసరం ఉందని సభ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండు దశాబ్దాలుగా స్విమ్స్ క్యాన్సర్ సేవలను అందిస్తోందన్నారు. శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హోదా కల్పించాలని ఆయ‌న‌ కోరారు.

*అత్యవసర సంసిద్ధత కోసం ఏవీ నిధులు?*

ఆరోగ్య రంగంలో అత్యవసర పరిస్థితులలో సన్నద్ధత కోసం ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించడం కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయ‌న అన్నారు. ఆరోగ్య రంగం విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందన కోసం కేటాయింపులు గ‌త బ‌డ్జెట్‌లో ₹128.14 కోట్లు కేటాయించార‌న్నారు. కానీ ఈ బ‌డ్జెట్‌లో కేవలం ₹94 కోట్లకు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో సహా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తరచుగా సంభవించే దృష్ట్యా, ఈ తగ్గింపు ఆందోళనకరంగా ఉందన్నారు. విపత్తు సంసిద్ధత మరియు ప్రతిస్పందన కోసం ప్రభుత్వం బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ తగిన నిధులు కేటాయించాలని అన్నారు.

*తిరుపతిలో ఇన్నోవేటివ్ మెడికల్ హబ్ ఏర్పాటు*

ఔషధాల ఉత్పత్తిలో దాదాపు 50 నుండి 55% ఎగుమతి చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం ఒకటని ఎంపీ తెలిపారు. కానీ భారతదేశంలో ఉపయోగించే మెడికల్ ఇంప్లాంట్లలో 80-85% దిగుమతి చేసుకున్నవే ఉపయోగిస్తున్నామని గుర్తు చేస్తూ తిరుపతిలో స్వదేశీ వైద్య ఇంప్లాంట్‌లను అభివృద్ధి చేయడానికి ఇన్నోవేటివ్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అందువలన దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వైద్య ఇంప్లాంట్లు తక్కువ ఖర్చుతో కూడుకున్నవన్నారు. మన దేశం కూడా ప్రపంచ పోటీదారుగా మారుతుందని ఆయ‌న‌ అన్నారు.

*మరిన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలి*

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపనకు 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు సరిపోవన్నారు. మన దేశంలో అత్యధిక శాతం యువ జనాభా ఉన్నప్పటికీ, 2016 నుండి విదేశాలలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థుల సంఖ్య 20% పెరిగిందన్నారు. దేశీయ వృద్ధి కేవలం 3% మాత్రమే అని సభ దృష్టికి తీసుకెళ్లారు. తగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించాల్సి వ‌స్తోంద‌న్నారు. అందరికీ అందుబాటు ధరలో వైద్య విద్య అందేలా ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్యను పెంచాల‌న్నారు. వైద్య విద్యలో మన సామర్థ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకొని వైద్య విద్య సీట్లను కూడా పెంచాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆంధ్రాలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని సంకల్పించింద‌న్నారు. ఆ దిశగా అడుగులు వేసిన‌ట్టు తిరుప‌తి ఎంపీ గురుమూర్తి తెలిపారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580355
Total Users : 48039