Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆ నలుగురు ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. -జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఎస్.ఎఫ్.ఐ ఫిర్యాదు

Published

on

 

పాఠశాల విద్య పూర్వ ఆర్జేడి వై.రాఘవరెడ్డి పై వచ్చిన ఆరోపణలపై విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో సుండుపల్లె ఎంఈఓ ను మాత్రమే బాధ్యుడిని చేస్తూ, మిగతా నలుగురిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ కు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఉదయం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జరుగుచున్న గ్రీవెన్స్ సెల్ కు హాజరై జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మంది ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక్క ఎంఈఓ ను మాత్రమే బాధ్యున్ని చేయడం తగదన్నారు. పూర్వ ఆర్జేడీ వై.రాఘవ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ డాక్టర్.ఎం.ప్రసన్నకుమార్ ను విచారణాధికారిగా నియమించి ఆరోపణలపై విచారణ చేపట్టిందని, ఆ మేరకు జూలై 18, 19 తేదీలలో కడపలోని డీఈవో కార్యాలయంలో విచారణాధికారి విచారణ నిర్వహించారన్నారు. విచారణకు విచారణాధికారి నుండి ఏలాంటి పిలుపు లేకపోయినా అన్నమయ్య జిల్లాకు చెందిన సుండుపల్లె మండల ఎంఈఓ వెంకటేష్ నాయక్, డిసిఇబి సెక్రెటరీ నాగముని రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, రాయచోటి మండలం మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఓబులవారిపల్లె మండలం మంగంపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గడ్డం ఆదినారాయణ రెడ్డి లు పూర్వ ఆర్జేడి కి మద్దతుగా నిబంధనలకు విరుద్ధంగా విచారణకు హాజరయ్యారని తెలిపారు. పైగా వీరంతా ఆయా పాఠశాలల్లో విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ వేసి విచారణకు హాజరయ్యారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్జేడి అవినీతిపై ఫిర్యాదు చేయడానికి విచారణకు వచ్చిన సుండుపల్లె మండలం, జి.కె.రాచపల్లె ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పై ఐదుగురు ఉపాధ్యాయులు దాడి చేసి సెల్ ఫోన్ పగలగొట్టారని, ఆ మేరకు నగర పరిధిలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో 262/2024 గా ఎఫ్ఐఆర్ నమోదయిందని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు పిలవకపోయినా , ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ ఆర్జేడికి అనుకూలంగా విచారణకు హాజరు కావడం, పైగా విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ లో నమోదు చేసి రావడం పట్ల విచారణాధికారి తీవ్ర ఆగ్రహవేశాన్ని వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టి ఐదు మంది ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఆర్జేడితోపాటు, డిఈఓ కు ఆదేశాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత ఆర్జేడి, డీఈవోలు ఐదు మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. ఆ మేరకు సిసిఏ రూల్స్ ను అతిక్రమించారని పేర్కొంటూ సుండుపల్లె ఎంఈఓ వెంకటేష్ నాయక్ ను ఈనెల 2 తేదీ సస్పెండ్ చేస్తూ ఆర్జేడి కె.శామ్యూల్ ఉత్తర్వులు వెలువరించారన్నారు. అయితే ఈ ఘటనలో ఒక్కరిని మాత్రమే సస్పెండ్ చేస్తూ మిగతా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంఈఓపై చర్యలు తీసుకొని మిగతావారిపట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సరైనది కాదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నలుగురు ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్,లోకేష్ పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580245
Total Users : 47929