ఆంధ్రప్రదేశ్
ధర్మారెడ్డి పాపాలు జగన్ కు శాపంగా మారింది. నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి జిల్లా
తిరుపతి నియోజకవర్గంలో తిరుపతిలోని స్థానిక ప్రెస్ క్లబ్.
” *ధర్మారెడ్డి పాపాలు జగన్ కు శాపంగా మారింది”..
నవీన్ కుమార్ రెడ్డి*
తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవో గా సకల శాఖలపై పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి ని రిలీవ్ చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ధర్మారెడ్డి ఈ రాత్రికి అమెరికా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిఘా సంస్థల ద్వారా సమాచారం సేకరించి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలి…
నారా చంద్రబాబునాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేత నవీన్ లేఖ,పార్టీ కార్యాలయాలకు మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి…
తిరుపతి ప్రెస్ క్లబ్ లో తిరుమల స్థానికులు హరిప్రసాద్ లోకేష్ త్రిలోక్ కుమార్ పగడాల భాస్కర్ తనుజు రాజ్ విగ్నేష్ జీవన్ రాయల్ లు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను బ్రష్టు పట్టించిన ధర్మారెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ఐదు సంవత్సరాలుగా టీటీడీలో ఎన్ని ధర్మకర్తల మండలి సమావేశాలు జరిగాయి? ఎన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు? అన్నదానిపై సిటింగ్ జడ్జితో విచారణకు ఆదేశించేలా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు,పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపాలన్నారు…
ధర్మారెడ్డిని టిటిడి నుంచి రిలీవ్ చేయకుండా అతని బ్యాంక్ అకౌంట్ లు,స్థిర చరాస్తులను చట్టపరంగా సీజ్ చేసి విచారణ చేపట్టి అక్రమ సంపాదనను శ్రీవారి ఖాతాలో జమ చేయాలన్నారు
టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా ధర్మారెడ్డి పాలనలో జరిగిన అవినీతిపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే టిటిడి ఈవో గా నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ ను నియమించాలాన్నారు..
టిటిడిలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన బోర్డు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల అజెండాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కమిషన్లకు కక్కుర్తి పడి శ్రీవారి నిధులను మంచినీళ్లలా ఖర్చు పెట్టేసారని ఆవేదన వ్యక్తం చేశారు..
తిరుమలలోని ధర్మారెడ్డి కార్యాలయంలో కొంతమంది భజనపరులను ఆలయంలోని అర్చకులను అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి అలాగే న్యాయవ్యవస్థ ద్వారా ఏవిధంగా దుర్వినియోగం చేశారో సాక్షాదారాలతో కూడా త్వరలో బయట పెడతానన్నారు..
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన గణాంకాఅధికారి
FA & CAO పై సీనియర్ IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్) స్థాయి అధికారి ద్వారా విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు!
తిరుమల శ్రీవారి కోట్లాది రూపాయల నిధులు,టన్నుల కొద్ది బంగారు జాతీయ బ్యాంకులలో భద్రంగా ఉన్నాయా లేక జగన్ మెప్పుకోసం బ్యాంకు రుణాల కోసం ప్రైవేటు బ్యాంకులలో డిపాజిట్ చేశారా అన్న దానిపై వెంటనే విచారణ చేపట్టాలన్నారు!
తిరుమల పవిత్రతను ధర్మారెడ్డి అపవిత్రం చేశారని తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు నాలుగు మాడవీధులలో పసుపు నీళ్లతో శుద్ధి చేసేలా ఆలయ జీయర్ల స్వాములకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు!
తిరుమల తిరుపతి స్థానికులను శ్రీవారి భక్తులను ఆలయ అర్చకులను టిటిడి ఉద్యోగస్తులను కొంతమంది మీడియా మిత్రులను తన అధికార బలంతో అహంకారంతో వేధించిన ధర్మారెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ హెచ్చరించారు .
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక