ఆంధ్రప్రదేశ్
క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 3కె రన్ ను ప్రారంభించిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
జాతీయ క్రీడా (హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు) దినోత్సవాన్ని మరియు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిమానస పుత్రిక ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించు కొని ఈరోజు ఉదయం 6:30 గంటలకు 3కె రన్ ను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని మరియు క్రీడల్లో అత్యున్నత స్థాయిలో సేవలు అందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నిమ్మకాయల సుధాకర్ వ్యవహరించగా (క్రీడాభారతి జనరల్ సెక్రటరీ) ముఖ్య అతిథులుగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , క్రీడాభారతి రాయలసీమ జోనల్ అధ్యక్షులు జి రామకృష్ణారెడ్డి , క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు శాంతినికేతన్ విద్యా సంస్థలసుధాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు . అనంతరం ధ్యాన్చంద్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి క్రీడాజ్యోతిని వెలిగించి త్రీ కె రన్ ను అతిధులు అందరు కలిసి జండా ఊపి ప్రారంభించడం జరిగినది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినందుకు ఆనందంగా ఉందని క్రీడలకు ఎప్పుడు మేము మా కుటుంబము మరియు మా పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఈ కార్యక్రమానికి పిలిచిన క్రీడాభారతి ఆర్గనైజర్స్ అందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
మరో ముఖ్యఅతిథి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడా పరిధి ఆధ్వర్యంలో క్రీడలను కింది స్థాయి నుంచి ఒలంపిక్స్ తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నదని దాంట్లో భాగంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలను క్రీడాభారతి నిర్వహిస్తున్నదని తెలియజేశారు.
క్రీడభారతి అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ క్రీడల కోసం నేను మా విద్యాసంస్థలు ఎప్పుడు కూడా ముందుండి ప్రోత్సహిస్తామని క్రీడాభారతి లక్ష్యాన్ని నెరవేరుస్తామని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం లో పాల్గొన్న పాఠశాల కళాశాలల యాజమాన్యాలకు కోచులకు,పి ఈ టి లకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు పాల్గొన్నటువంటి క్రీడాకారులకు అందరికీ క్రీడా భారతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో క్రీడాభారతి నిర్వాహకులు హేమంత్ రెడ్డి,మహేశ్వరి ,రమేష్, రమణ, ఎల్లయ్య, గోపి, సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, బాలకృష్ణ, మాలిక్ భాష, ప్రదీప్ రెడ్డి, నాగార్జున, రాజు, తేజ, అఖిల్, మరియు సుభాష్ అకాడమీ వార మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక