ఆంధ్రప్రదేశ్
మాతృ శిశు మరణాల రేటు జీరో స్థాయికి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
హైరిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించండి.
ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి మాతృ శిశు మరణాలు జరగకుండా వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో జిల్లా స్థాయి మేటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డా. జఫరుల్లా, జిజిహెచ్ గైనకాలజిస్ట్ డా. పద్మజ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ డా.శ్రీజ, డిఐఓ డా. ప్రసన్న, ఐసిడిఎస్ పిడి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నమోదైన ప్రతి గర్భిణీ స్త్రీపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరాయంగా వైద్య సేవలు అందించడంతోపాటు పోషక పదార్థాలు పంపిణీ చేసి మాతృశిశు మరణాల రేటును జీరో స్థాయికి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత మూడు నెలల కాలంలో నాలుగు మాతృ మరణాలు, మూడు శిశుమరణాలు జరగడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృత్తమైతే సంబంధిత అధికారులను ఉపేక్షించకుండా సర్వీస్ నుండి తొలగించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉండి కూడా తల్లి బిడ్డలను సంరక్షించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ప్రతి గర్భిణీ స్త్రీ నమోదైనప్పటినుండి నిరంతరాయంగా ఫాలో అప్ చేస్తూ వైద్య చికిత్సలు అందిస్తూ కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఏ హాస్పిటల్లో మరణం జరిగిన సంబంధిత హాస్పిటల్ సిబ్బంది సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలన్నారు. రిఫరల్ హాస్పిటల్ కు పంపేటప్పుడు గర్భిణీ స్త్రీలకు ఎలాంటి చికిత్సలు అందించారు? మరణం ఎలా సంభవించింది? సంబంధిత నివేదికలన్నీ డాక్టర్ల నుండి సేకరించడమే కాకుండా బంధువుల నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకురావాలని రావాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. సమావేశానికి వచ్చే ముందు అన్ని అంశాలను విశ్లేషించుకోవాలన్నారు. జిల్లాలో స్త్రీశిశు సంక్షేమ శాఖ పనిచేస్తుందా, లేదా అని అన్ని అంశాలలో పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతృ శిశు మరణాల నివారణలో వైద్యశాఖ స్త్రీశిశు సంక్షేమ శాఖలు పూర్తిగా వైఫల్యం చెందాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకు సరైన పోషక పదార్థాలు పంపిణీ చేయడం, కౌన్సిలింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన సిడిపిఓ, అంగన్వాడీ సూపర్వైజర్, కార్యకర్తలను సస్పెండ్ కు ఫైల్ సర్క్యూలేట్ చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడిని ఆదేశించారు. 21 సంవత్సరాలకే నాలుగు డెలివరీలు అవుతున్న శ్రీ శిశు సంక్షేమ శాఖ కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. హైరిస్క్ గర్భిణీ స్త్రీలకు అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైతే సరైన వైద్య చికిత్స కేంద్రానికి రెఫర్ చేయాలని ఆదేశిస్తూ ఫాలో అప్ చేయాలన్నారు. సర్వజన ఆస్పత్రి, డిసిహెచ్ఎస్ లకు ప్రమాద సంకేత లక్షణాలు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు వెంటనే తగు అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక