ఆంధ్రప్రదేశ్
చాగలమర్రి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ .

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
గత ప్రభుత్వంలో రి సర్వేలో చాలా వరకు అన్ని మోసాలే జరిగాయని రీ సర్వే పేరుతో ప్రజలందరిని మోసం చేశాడని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు.
కౌలు రైతులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఆర్.బి.కెలో నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు రావని ప్రతి ఒక్క కౌలు రైతు ఆర్ బి కే లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
చాగలమర్రి మండలంలో ఎలక్షన్ ముందు కాంపెనింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ప్రతి మండలానికి 2.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతే కాకుండా ఎమ్మెల్యే ఫండ్స్, సర్పంచు నిధులు అన్ని వస్తాయని తెలిపారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం నేను అన్ని విధాలుగా పోరాడుతాను అన్నారు. ప్రతి ఒక్క ఏరియాలో రోడ్లు సైడ్ కాలువలు కచ్చితంగా ఉండాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ అని పార్టీలను పక్కన పెట్టి ప్రజలందరికి అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎవరికీ ఏమి సమస్య ఉన్న కచ్చితంగా నా దృష్టికి తీసుకొని రండి కచ్చితంగా నేను సాల్వ్ చేసేస్తాను అని తెలిపారు.
చాగలమర్రి మండలానికి రెండు కొత్త సబ్ స్టేషన్ సాంక్షన్ చేయడం జరిగిందని అలాగే ఉద్యోగస్తులు తక్కువగా ఉన్నారన్న విషయం మా దృష్టికి తీసుకువచ్చారు త్వరలోనే అన్ని ఫీల్ చేయిస్తాం అన్నారు.
మినీ గోకులాలు మండలానికి 25 ఇచ్చారు కానీ అవి సరిపోవు కనుక సంబంధిత మంత్రి గారితో మాట్లాడం జరిగింది మండలానికి 100 గోకులలు కావాలని చెప్పడం జరిగిందని తెలిపారు.
గవర్నమెంట్ స్కూల్లో స్టాఫ్ ఎక్కడ తక్కువ ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని రావాలని ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అన్నారు. పిల్లలకు పెట్టె మిడ్డే మిల్స్ ఏ పార్టీ వాళ్ళు అయినా పర్లేదు పిల్లలకు మాత్రం మంచి ఫుడ్ పెట్టాలి. ఏమైనా తేడా వస్తే ఎవ్వరికీ ఊరుకోను అన్నారు.
చాగలమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ అయితే అమ్మాయిల స్కూల్ కాలేజ్ లు ఉన్నాయో నా సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. త్వరలోనే స్టేషన్ కి కొత్త స్టాప్ వచ్చేలాగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి చేపిస్తాం తెలిపారు.
గత ప్రభుత్వం లో చాలా తప్పుడు కేసులు పెట్టారు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఒక్కసారి ఎంక్వయిరీ చేసి కచ్చితంగా తప్పు చేశాడంటే కేసులు పెట్టండి అవసర కేసులు పెట్టి ఉంటే కొట్టివేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరారు.
ప్రభుత్వ గవర్నమెంటు హాస్పిటల్ కి సంబంధించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని ఇప్పుడు కొత్తగా వచ్చే వైరస్ లపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిలేషన్ ఇవ్వాలని డాక్టర్స్ కి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సూచించారు.
ఎవరు అయితే టైమ్ కి పెన్షన్ ఇవ్వలేరు పంచలేరని మాట్లాడారో వారికీ బుద్ది చెప్పేలాగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా పంచి వారి నోరు మూపించిన చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, చాగలమర్రి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక