ఆంధ్రప్రదేశ్
31వ తేదీ నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఈ నెల 31వ తేదీ శనివారం రోజున ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పెన్షన్ల పంపిణీపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబరు 1 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆగస్టు 31న ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,19,046 మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్ల కింద రూ.92.56 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. పెన్షన్ల పంపిణీకి దాదాపు 8800 మంది సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బందిని కూడా వినియోగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను సూచించారు. 31వ తేదీ ఉదయం 6 గంటలకు అన్ని సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించి అదేరోజు సాయంత్రానికి నూరుశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్లు అందుకోని పక్షంలో సెప్టెంబరు 2న అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక