ఆంధ్రప్రదేశ్
నంద్యాల టౌన్ 26 ,27 వార్డులలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలియజేశారు. నంద్యాల టౌన్ 26 ,27 వార్డులలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఉదయమే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండడంతో అటు పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేయగా, ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి ఫరూక్ పనితీరును మెచ్చుకున్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా ఇంటి వద్దకు వచ్చిన మంత్రిని లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదు అందుకుని, అభినందనలు తెలియజేశారు. పలువురు వారి సమస్యలను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికి పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధంగా చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయడం మూడో నెల అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ ఈ నెలలో మాత్రం ఒకటో తేదీ ఆదివారం రావడంతో అధికారులను ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అయితే ఈ క్రమంలో రెండవ తేదీ పెన్షన్ ఇవ్వాలని సూచించిన ఇచ్చిన మాట ప్రకారం ఒకటే తేది పింఛన్ పంపిణీ చేయాలని, ఒకటో తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో సీఎం నిర్ణయంతో ఓ రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదును ఇంటింటి కెళ్ళి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తుండడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం పెన్షన్ నగదు కోసం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 36 వేల కోట్ల రూపాయల నగదును వెచ్చిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ అవగాహన పాలన రాహిత్యంతో ఖజానా ఖాళీ అయిందని మండిపడ్డారు. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు సమయానికే పెన్షన్ నగదు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేలా ఆదేశించడం కూటమి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ మొదలుపెట్టిన అధికారుల అందరికీ తాను అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసిందని మండిపడ్డారు . అయితే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చాక ముందుగా లోకల్ బాడీస్ బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఓ ప్రణాళికబద్ధంగా పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 27 వార్డు కౌన్సిలర్ జైనాబి , కౌన్సిలర్ శ్రీదేవి , మాజీ కౌన్సిలర్లు దస్తగిరి , పల్లె సుబ్బయ్య , కొండారెడ్డి , వెంకటేశ్వర్లు , శంషీర్ , కులాయి భాష , బాబు , సాయిరాం , బాలు మరియు మున్సిపల్ కమిషనర్ , మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక