ఆంధ్రప్రదేశ్
వర్షాకాలంలో అంటు వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలోని అతిసార బాధితులను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరమార్శించారు.
ఈ సందర్బంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వేంపెంట గ్రామంలో కలుషితం నీటివల్లే అతిసారా వ్యాధి ప్రభలిందని, బోయ లక్ష్మిదేవి అతిసారా వ్యాధితో మృతి చెందడం విచారకరం అన్నారు. మరో 18 మంది వైద్యం తీసుకుంటున్నారని వారికీ వేంపెంటలోనే ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డు మెంబర్లు కలిసికట్టుగా గ్రామాల్లో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని, మురుగునీరు నివాసాల మధ్య నిల్వ ఉండకుండా చేయాలని సూచనలు చేశారు. దోమల అవాసాలు మురుగుకుంటలు అని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
దోమల వల్లే డేంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వస్తాయని, కలుషితం తాగునీటీ వల్ల వాంతులు, విరేషనాలు కలుగుతాయని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, శుద్ధ జలాలు మాత్రమే తాగాలని ఆమె ప్రజలను కోరారు.
గ్రామాల్లో సమస్య వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందించి వాటి పరిష్కారం కోసం సహకరించగలరు కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీ శబరి హెచ్చరించారు.
అతిసారా వ్యాధితో మృతి చెందిన బోయ లక్ష్మిదేవి కుటుంబాన్ని ఎంపీ శబరి పరమార్శించి తన సొంత నిధులు రూ.10 వేలు అందించి, ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక మెడికల్ క్యాంపును ఎంపీ శబరి సందర్శించి వైద్యులకు పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్ డి ఓ దాసు, పాములపాడు ఎం ఆర్ ఓ సుభద్రమ్మ, ఎం పి డి ఓ గోపాలకృష్ణ, పిహెచ్ సి డాక్టర్ నాగ లక్ష్మి రెడ్డి, వేంపెంట మాజీ సర్పంచ్ గాండ్ల నాగలక్ష్మమ్మ, టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, మాజీ జడ్ పి టీ సి నాగేశ్వరావు, కట్టుబడి శ్రీనివాసులు, కురువ ఎల్లయ్య, కురువ రమేష్, పోతులపాడు శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక