ఆంధ్రప్రదేశ్
నంద్యాల కుందునది పరివాహక ప్రాంతాని పరిశీలించిన న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాలలో ఎప్పటికప్పుడు పరిస్థితుల పర్యవేక్షణ.
మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆదేశాలతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.
ముంపు ప్రాంతాల్లో స్థానిక నాయకుల ద్వారా సమాచార సేకరణ.
న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆదేశాలతో నంద్యాలలో వరద సహాయక చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. మంత్రి ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో బాధ్యతలు అవసరమైన ఆహారం, తాగునీరు సరఫరా గురించి ఆరా తీశారు . స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు మంత్రి ఫరూక్ అక్కడ వివరాలను తెలుసుకుంటున్నారు . విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు . అలాగే ఎక్కడైనా రోడ్లపై అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందా అని సమాచారం తెలుసుకున్న అలాగే అన్ని విధాలుగా అందరికీ సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నంద్యాల , నంద్యాల చుట్టుపక్క ప్రాంతాలలో కాలువలకు నదులకు నీరు ఎక్కువ రావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం తనే స్వయంగా కుందూ నది పరివాహక ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని వీలైనంతవరకు ఇంటి వద్దనే ఉండాలని , చేపలు పట్టేవారు నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో నీళ్ల వద్దకు వెళ్ళవద్దని ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు . అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మంత్రి కార్యాలయానికి అందజేయాలని ఏదైనా ప్రజలకు అవసరం ఉంటే వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా అలర్ట్ గా ఉండాలన్నారు . ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి , మిద్దె చిన్న ఉసేని , బింగుమళ్ల శ్యాంసుందర్ మరియు అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక