Connect with us

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కృష్ణార్జునులు : ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ (వీడియో)

Published

on

చిత్తూరు జిల్లా
కుప్పం :
రిపోర్టర్:శంకర్


ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణార్జునులా కలిసి ముందుకు వెళ్తున్నారని,వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం కె.ఆర్ పురంలో బెంగుళూరు టిడిపి ఫోరం 11వ వార్షికోత్సవ (నవశకం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం టిడిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర మంత్రి సవితమ్మ, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ,శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, శాసనసభ్యులు సురేంద్రబాబు డాక్టర్ సురేష్ బాబు, చెన్నై టీడీపీ ఫోరమ్ చంద్ర , రావి మోహన్ ,తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ… నవశకం… మంచి రోజులు వచ్చేశాయి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన బెంగళూరు టిడిపి ఫోరం సభ్యులకు కృతజ్ఞతలు… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేందుకు యువత ఎంతగానో కష్టపడ్డారు అన్నారు. తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బెంగళూరు ఫోరం సభ్యులు టిడిపి అధినేతపై ఎంతో అభిమానంతో ఎన్నికల సమయంలో ముందుకొచ్చి రాష్ట్రానికి విజనరీ నేతను ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలో రానున్న రోజుల్లో నూతన తరాన్ని ఎంపిక చేసినందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. బెంగళూరు ఫోరం సభ్యులు ఎన్నికల సమయంలో ఒక కమిట్మెంట్ తో పని చేశారన్నారు. వైకాపా ఐదేళ్ల అరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని,రానున్న రోజులు మంచి రోజులని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమంకి పెద్దపీఠం వేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలో పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నారని, అది కేవలం చంద్రబాబు బ్రాండ్ అన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైసీపీ చేసే చౌకబారు విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580331
Total Users : 48015