ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
మట్టి గణపతి ప్రకృతిహితమే పండగల పరమార్థం.
మట్టి విగ్రహం తీసుకురావడం వల్ల వాతావరణానికే కాదు, ఆరోగ్యానికీ మంచిదని ,
నంద్యాల పట్టణంలోని ఆత్మకూరుబస్టాండ్ సమీపం లోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకై బాల బాలికలచే మట్టి వినాయకుల ప్రతిమలను చేయించి,వాటి విశిష్టతను తెలియజేశారు.కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ మెట్టమొదటగా నంద్యాల పట్టణము నందు గత 18సంవత్సరాలుగా మట్టి వినాయకుని విగ్రహాలను నంద్యాల జిల్లా శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సెక్రటరీ ఎం జె ఎఫ్. ఎల్ ఎన్.ఎం.జి.వి.రవీంద్రనాథ్,మాధవీలత దంపతులు ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతున్నది. మమ్మలను ఆదర్శముగా తీసుకోని నేడు పట్టణo నందలి అన్ని స్వచ్చంద సంస్దలు ఉచిత మట్టి విగ్రహాలు పంపిణి చేయడం జరుగుతున్నదని తెలిపారు.
వినాయక చవితికి ఇక కొన్ని గంటలే ఉన్నాయని, ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారని ,స్వీట్స్, డ్రెస్సెస్, డెకరేషన్స్, విగ్రహం తెచ్చుకోవడం వంటి పండుగ పనుల్లో ఆర్భాటంగా ఉంటారని తెలిపారు. కానీ మీరు ఒకవేళ ఏ విగ్రహం తీసుకురావాలి అనే ఆలోచనలో ఉంటే మీరు ఖచ్చితంగా మట్టి గణపతినే తీసుకురావడం మంచిదని అన్నారు.
కలర్ ఫుల్ గా, మెరిసిపోతూ, పెయింటింగ్ తో ఉండే వినాయక విగ్రహాలు అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి కానీ వీటివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని సూచించారు. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిదని అన్నారు. వాటికి బదులు మట్టి గణపతులు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయని, ఎకో ఫ్రెండ్లీ గణపతులను మట్టితో తయారు చేస్తారు కాబట్టి ఇవి నిమజ్జనం చేసినప్పుడు తేలికగా మట్టిలో కలిపోగలవు సూచించారు. మట్టి గణపతినే ఎందుకు తీసుకురావాలి అనేదానిపై కొన్ని ముఖ్యమైన కారణాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మట్టి గణపతినే తీసుకొస్తారు అన్నారు.
మట్టి విగ్రహాలు మనుషుల జీవితంపై, వాతావరణంపై ఎలాంటి దుష్ర్పభావం చూపించవు, ఇవి కాస్త డల్ గా కనిపించినా ఎట్రాక్ట్ చేయకపోయినా ఆరోగ్యానికి, వాతావరణానికి ఇవే మంచిదని తెలిపారు.
వినాయకుడి విగ్రహం అలంకరణ కోసం ఉపయోగించే కలర్్స్ లో ఎక్కువ మొత్తంలో మెర్క్యురీ, లెడ్ ఉంటుందని తెలిపారు. ఇవి నరాల వ్యవస్థపై, పిల్లలు, గర్భిణీ స్త్రీలపై చాలా దుష్ర్పభావం చూపిస్తాయని అన్నారు. కాబట్టి కలర్ ఫుల్ గణేష్ కి బదులు మట్టి గణపతిని తీసుకురావడం మంచిదని అన్నారు.
వినాయకుడి విగ్రహాలను అందంగా అలంకరించడానికి ఉపయోగించే డైలు చాలా హానికరమైనవి, ఇందులో హానికారక మెటల్స్ ఉంటాయని, ఇవన్నీ జీర్ణవ్యవస్థపై చాలా దుష్ర్పభావం చూపిస్తాయని తెలిపారు.
డైస్, కలర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివన్నీ విగ్రహం తయారి కోసం ఉపయోగిస్తారని, ఇవి ఆరోగ్యంపై చాలా దుష్ర్పభావం చూపుతాయని అన్నారు. ఈ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కలుషితం అవుతాయని తెలిపారు. ఆ నీళ్లు ఊపిరితిత్తులపై దుష్ర్పభావం చూపుతాయని, గ్లిట్టర్స్ చేతులకు అంటడం వల్ల అవి లంగ్స్ తీవ్ర డ్యామేజ్ చేస్తాయి అని తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక