ఆంధ్రప్రదేశ్
ప్రతి మండపంలో అగ్ని ప్రమాద నివారణ పరికరాలు సిద్ధంగా ఉంచుకోండి : జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మజ.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోండి.
వినాయక నిమజ్జన మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మజ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కమిటీ సభ్యులను సూచించారు.
బుధవారం కలెక్టరేట్ లోని సెంటనరీ హాలులో వినాయక నిమజ్జన మహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, నంద్యాల డిఎస్పి యుగంధర్ బాబు, ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్, కేంద్ర గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు జి రామకృష్ణారెడ్డి, జి విజయ్ కుమార్, సివి చలం బాబు, నిమ్మకాయల సుధాకర్, నాగేంద్ర, శంకర్, పుల్లయ్య, సత్యం, కృష్ణమాచారి, చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మజ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశాల మేరకు ఈనెల 11వ తేదీన స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. కమిటీ సభ్యులు సూచించిన అంశాలను కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ మేర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్ మండపాల విద్యుత్ కనెక్షన్లకు 1100 రూపాయలు చెల్లిస్తామని, పారిశుద్ధ్యం, తాగినీటి వసతి, భారికేడ్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లు, బోట్లు లైటింగ్ తదితర అంశాలన్నింటిని మొదటి కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అగ్నిమాపక యంత్రాలన్నీ విజయవాడకు తరలించడం జరిగిందని గణేష్ మండపాలలో ఊదీ బత్తీలు, దీపారాధన, హారతి, విద్యుత్ దీపాలు వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రతి మండపంలో రెండు బకెట్ల ఇసుక, ఒక డ్రమ్ము వాటర్, బెడ్ షీట్ తప్పనిసరిగా ఉంచుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించామని ఉత్సవ కమిటీ సభ్యులందరూ అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. వీలైనంతవరకు డ్రమ్స్, డిజే, అధిక శబ్దాలతో వాయిద్యాలు లేకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ విగ్రహాలు వెళ్లే రహదారులలో రోడ్డు ప్యాచ్ వర్క్ లు కూడా ప్రారంభమయ్యాయని సభ్యులు సూచించిన ప్రకారం చిన్న చెరువు కట్ట వద్ద, అవసరమైన ప్రాంతాలలో బార్కేడింగ్ పనులు కూడా చేపడతామన్నారు. నంద్యాల పట్టణంలో 11వ తేదీ ముమ్మర పారిశుద్ధ్య చర్యలతో పాటు గుర్తించిన నాలుగు ప్రదేశాల్లో త్రాగునీటి సదుపాయం, చెరువు కట్టపై రెండు మొబైల్ టాయిలెట్లు, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను తడిచిన కర్రలతో సవరించడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని సంబంధిత విగ్రహ కమిటీ సభ్యులు ముందస్తుగా విద్యుత్ అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ మారిన కాలమాన పరిస్థితులను బట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం మహోత్సవాలను ప్రశాంతంగా జరిగించేందుకు కమిటీ సభ్యులందరూ సహకరించి విజయవంతం చేయాలన్నారు. చెరువు కట్ట, గాంధీచౌకు, విక్టోరియా రీడింగ్ రూమ్లలో మూడు మెడికల్ క్యాంపు లతో పాటు వద్ద 108 అంబులెన్స్ ను కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని గణేష్ విగ్రహాన్ని తొలుత నిమజ్జనం చేసి పిదప నిరంతరాయంగా పట్టణంలోని దాదాపు 500 విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతకుముందు జిల్లావ్యాప్తంగా హాజరైన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక