ఆంధ్రప్రదేశ్
ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్న రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్

ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూలు
ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్న రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్
రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు టి జి భరత్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మాత్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాణిజ్య సరళీకరణ విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గూర్చి చర్చించారు. జితిన్ ప్రసాద, సహాయ మంత్రి, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ‘ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో దేశంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫాం యాక్షన్ ప్లాన్) లో భాగంగా జిల్లా సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక (డిస్ట్రిక్ రిఫాం యాక్షన్ ప్లాన్) అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఈ కారణంగా కేంద్రం నుండి ఋణ పరిమితికి మించి (స్థూల రాష్టోత్పత్తిలో రెండు శాతం, అదనంగా) ఋణం పొందడం జరిగిందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రప్రథమంగా, ఆంధ్రప్రదేశ్ 2015లో, వ్యాపార రంగానికి సంబంధించి ఏక గవాక్ష విధానం (సింగిల్ విండో పోర్టల్ & క్లియరెన్స్ మెకానిజం) ప్ర్రారంభించడం జరిగిందని వివరించారు. 14 వివిధ కార్మిక చట్టాలను ఒకే సరళ కార్మిక చట్టంగా చేయగలిగామన్నారు. ఆన్లైన్ వ్యర్థ నిర్వహణ పోర్టల్, ఆన్లైన్ ముడి పదార్థాల కేటాయింపు ప్రారంభించామన్నారు. చలనచిత్రాల షూటింగ్ అనుమతుల వ్యవస్థను సరళీకరించి, అవస్థలు లేకుండా ఐదు రోజుల్లోనే పూర్తి అనుమతులు పొందే విధంగా చేయగలిగామన్నారు.
ముఖ్యమంత్రి పటిష్ట నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా సాధించడానికి అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిన్న, మధ్య తరహా, భారీ మరియు అతి భారీ స్థాయి పరిశ్రమలన్నింటికీ రాష్ట్రంలో ఎదిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సృజనాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక మరియు వాణిజ్య విధానాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కు మించి “స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు పయనిస్తున్నాయని తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక