ఆంధ్రప్రదేశ్
పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్. గురుమూర్తి డిమాండ్

తిరుపతి
పులికాట్ ఎకో సెన్సిటివ్ పరిధిలో రోడ్ కనెక్టివిటీ మెరుగుపరచాలి*
తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టరు ఎస్. వెంకటేశ్వర్లు కమిటీ చైర్మన్ హోదాలో పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి హాజరయ్యారు. పులికాట్ సరస్సు ప్రాంత పరిధిలోని ఎకో సెన్సిటివ్ జోన్ లో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన వాకాడు, చిట్టమూరు, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు చెందిన సుమారు 80 వేల మంది నివసిస్తున్నారు అని ఆయన అన్నారు.
పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 461 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉందని, బర్డ్ శాంక్చురీ ఏర్పాటు అయిన తర్వాత సదరు గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ లేదు అని కొత్త రోడ్డు వేయాల్సిన అవసరం ఉందని కానీ ఆ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి రావడం వలన పాత రోడ్లను బలోపేతం, వెడల్పు చేయడానికి, కొత్త రోడ్ల నిర్మించడానికి అధికారుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలియజేశారు.
స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా అక్కడి ప్రజలు రోడ్ కనెక్టివిటీ లేక పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈ సమస్యపై పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించినట్లు తెలియజేసారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో ఏకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకొని పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిందని అన్నారు. అక్టోబర్ నెల 2023 లోనే కలెక్టరు కమిటీ చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేయబడిందని తెలియజేసారు.
ఈరోజు జరిగిన తొలి కమిటీ సమావేశంలో ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో రోడ్ల నిర్మాణాల కోసం జరిగిన చర్చలో జూన్ నెల 2022 వ సంవత్సరం 03 తారీఖున గౌరవ సుప్రీమ్ కోర్ట్ వారి తీర్పు ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్ లలో రోడ్ల విస్తరణ, రోడ్ల బలోపేతం చేయవచ్చని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కమిటీ సమావేశంలో వివరించారు. అలాగే కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ద్వారా పొందిన సమాచారాన్ని కూడా ఎంపీ గురుమూర్తి కమిటీ ముందు ఉంచారు.
జూన్ 26 2015 భారత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్, ఏప్రిల్ 26 2023 గౌరవ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్ లలో నిషేధింపబడిన కార్యకలాపాలు మినహా ప్రజల మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పనులను కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఇందులో భాగంగా రోడ్ల బలోపేతం, విస్తరణ మినహాయింపబడ్డాయన్న విషయాన్నీ కమిటీకి తెలియజేసారు.
రిట్ పిటిషన్ నెంబరు.1650/1998 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం దుగరాజపట్నం పరిధిలోని పలు గ్రామాలను ఇదివరకే ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో నుంచి తీసివేయడం జరిగిందని కమిటీకి వివరించారు.
అలాగే త్వరితగతిన పులికాట్ ముఖ ద్వారాన్ని పూడి రాయి దొరువు వద్ద పూడిక తీయాలని సాగారమాల కింద చర్యలు చేపట్టాలని సూచించారు. పులికాట్ ఎకో టూరిజం ప్రణాలికలు రూపొందించాలని సూచించారు. ఇరకం దీవి లోని పిల్లలకు విద్యాపరంగా వారు ప్రయాణించే బోట్ ఇంజిన్ మరమ్మత్తు ఉన్నాయని వాటికి ఎంపీ లాడ్స్ కింద నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే పూడిరాయదొరువుకు రోడ్ కనెక్టివిటీ అవసరం ఎంతైనా ఉందని ఎంపీ తెలియజేసారు.
కమిటీ చెర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాగర మాల కింద పూడిక తీతకు చర్యలు నిధుల విడుదల మేరకు చర్యలు నిబంధనల మేరకు చేపడతామని, అలాగే ఇరకం కుప్పం నందు పట్టాల పంపిణీ కి త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు. పులికాట్ లేక్ ఎకో టూరిజం కొరకు ప్రణాళికలు తయారీకి చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ వారికి సూచించారు. గ్రావెల్ నుండి బిటి రోడ్ కొరకు, రోడ్ వెడల్పు కొరకు, రహదారి బలోపేతం చేయడానికి కమిటీ స్టడీ చేసి సూచించిన నిర్ణయం మేరకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 80 వేల మంది ప్రజలకు సంబంధించిన సదరు అంశాలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిరాయదొరువు వద్ద పూడికతీత ద్వారా పులికాట్ మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు మెరుగు పడతాయని, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల రహదారి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై కమిటీ నిబంధనల మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శామ్యూల్, రీజనల్ డైరెక్టర్ పర్యాటక శాఖ రమణ ప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎ.నాగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, డి డి మత్స్య శాఖ నాగరాజు, కాలుష్య నియంత్రణ మండలి ఎఈ మదన మోహన్ రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయ డిఎఓ రవి కుమార్, పలు మండలాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక