ఆంధ్రప్రదేశ్
మా భూమిని ఆక్రమించారు (వాయిస్)

కడప జిల్లా
జమ్మలమడుగు
జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లి గ్రామంలో పన్నెండు సంవత్సరాలుగా కొండ,గుట్టలను చదును చేసుకుని తయారు చేసుకుని తమ సాగులో వున్న భూమిని ఆక్రమించి రోటికాడి పెద్దయ్య,రోటీకాడి చలపతి దౌర్జన్యం చేస్తున్నారు అని రోటీకాడి జయలక్ష్మి,రామకృష్ణ లు వాపోయారు.అంతే కాకుండా తన పేరుతో,తన భర్త రామకృష్ణ పేరుతో విద్యుత్ శాఖ ఇచ్చిన రెండు ట్రాన్స్ ఫార్మర్ లను చోరీ చేశారని,ఈమేరకు తాను పోలీస్,విద్యుత్ శాఖలకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ మేరకు జమ్మలమడుగు కోర్టులో కేసు నడుస్తోందని,చోరీ అయిన ట్రాన్స్ఫార్మర్ల సర్వీసు నంబర్ల వివరాలు 171,172 గా తెలియ చేశారు. ఈ భూమిపై హైకోర్టులో కేసు నమోదు చేశామని అన్నారు.కేసు కోర్టులో ఉండగానే తన భూమిలో దౌర్జన్యం చేసి కందిపంట వేశారని అన్నారు.సదరు భూమి గురించి తమకు అసైన్మెంట్ అయిందని అయితే రికార్డు కావడానికి ఒకరోజు ముందు ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని అన్నారు.కొండ రాళ్ళ తో,గుట్టలతో నిండీ ఉన్న ఈ భూమిని తయారు చేసేందుకు రెండు సంవత్సరాలు కష్టపడ్డానని, దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు అయిందని అన్నారు.తనకు కిడ్నీ ప్రాబ్లం వల్ల చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు పట్టణంలో చేరామని,దాంతో మా భూమిని ఆక్రమించి పంట వేశారని అన్నారు.తాము వెళ్లేందుకు వీలు లేకుండా గేటుకు కంప వేశారని అన్నారు. పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను ధ్వసం చేసి ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేశారని అన్నారు.తాను 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశానని…దాంతో కక్షకట్టిన నాటి వైఎస్సార్ పార్టీలో కొనసాగిన పెద్దయ్య,చలపతి లు గత నాలుగు సంవత్సరాలుగా ఆర్థికంగా కృంగదీసెందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.ప్రస్తుతం వీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు అన్నారు.అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అన్నారు.గతంలో తనపై,తమ భార్య పై హత్యాయత్నం చేశారని,తాము ప్రయాణిస్తున్న కారుపై బండరాళ్లతో దాడి చేశారు అన్నారు.ఆ మేరకు తాను పోలీస్ కేసు నమోదు చేశానని అన్నారు. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశానని అయినా వారి దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు అన్నారు.అధికారులు,పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక