Connect with us

ఆంధ్రప్రదేశ్

గతంలో ఒక లెక్కా, ఇప్పుడు నుంచి మరో లెక్క అధికారులకు హెచ్చరిక . నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

Published

on

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

నంద్యాల జిల్లా సమగ్రాభివృద్దికి కృషి చేద్దాం .

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు .

అధికారులు గత ప్రభుత్వ మైకంలోనే ఉన్నారనీ, వాటినుండి బయటపడాలని, గతం ఒక లెక్కా, ఇప్పటి నుంచి మరో లెక్క అని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులందరం నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ( దిశ కమిటీ ) చైర్ పర్సన్ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు.
మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంటనరీ హల్ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ( దిశ కమిటీ ) సమావేశం జరిగింది.
దిశ కమిటీ కన్వీనర్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ భారత ప్రభుత్వ గ్రామీనాభివృద్ది శాఖ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు నంద్యాల జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాఖల వారిగా సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు, జరుగుతున్న పనుల పురోగతి, ఎక్కడైనా ఆలస్యంకు గల కారణాలు ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు, కొత్త పథకాల మంజూరుకు సంహకరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఎంపీపీలు, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి దృష్టికి తెచ్చారు. వీటిని పరిష్కరించి, అన్ని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూస్తామన్నారు.
జిల్లా కేంద్రం నంద్యాలలోనే కేంద్రీయ విద్యాలయం, నవోదయ స్కూల్ మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ శబరి చెప్పారు. గత వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒక విద్యాశాఖ నుంచే పనులు సకాలంలో పూర్తి చేయనందున 700 కోట్ల రూపాయలు వెనక్కు వెళ్ళాయని, ఆ తప్పు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని శాఖలు సకాలంలో పనులు పూర్తి చేసి ఎక్కువ నిధులు రాబట్టేందుకు అధికారులు పనిచేయాలని ఎంపీ శబరి కోరారు.
53 శాఖల అధికారుల నివేదికలపై దిశ కమిటీ సమావేశంలో శాఖల వారిగా సమీక్షించారు. గత తప్పిదాలు మళ్ళీ జరుగకుండా చూడాలనీ, సమన్వయంతో జిల్లా ప్రగతికి కృషి చేద్దాం అన్నారు.
ఈ దిశ సమావేశంలో కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి. జిల్లా పరిషత్ సి ఈ ఓ నాసరారెడ్డి, డిప్యూటీ సి ఈ ఓ వెంకట సుబ్బారెడ్డి, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580245
Total Users : 47929