ఆంధ్రప్రదేశ్
రౌతు ఈశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం లో కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొండేటి చిట్టిబాబు హాజరయ్యారు
ఆయన మాట్లాడుతూ దేశం గర్వించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉందని కొనియాడారు అలాంటి రాహుల్ గాంధీని ప్రధాని నరేంద్ర మోడీ టెర్రరిస్ట్ అని సంబోధించడం దురదృష్టకరమని అన్నారు రెండుసార్లు ప్రధానిగా చేసే అవకాశం వచ్చిన దానిని వదులుకున్నారని ఆయన గొప్పతనాన్ని అందరూ గుర్తించాలని అన్ని కులాలకు మతాలకు సామరస్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చే విధంగా కృషి చేస్తానని జిల్లా లోని అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కృషి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు
నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు రాహుల్ గాంధీకి సోనియాగాంధీకి షర్మిలా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తనవంతు కృషిని పార్టీకి అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు
కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొండేటి చిట్టిబాబును అభినందించారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో నియోజకవర్గనికి విచ్చేసినందుకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలను ఒక తాటిపై నడిపించి కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవం తీసుకురావాలని జిల్లాలో గల ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఆయాబత్తుల సుభాషిని, పుప్పాల శ్రీధర్, కంటిపూడి నాగేంద్ర, గ్రంధి శేషగిరిరావు ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక