Uncategorized
పంట సాగులో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన …..వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ.

ఏపీ టుడే న్యూస్య
మద్దిలేటి రుద్రవరం విలేకరి,
నంద్యాల జిల్లా రుద్రవరం;
పంట సాగులో రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించినట్లు వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు. మండలంలోని కోటకొండ, యల్లావత్తల గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వారంలో రెండు రోజులు గ్రామాల్లో పర్యటించి ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటలసాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి వివరించి సాగులో మెలకువలు రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినదన్నారు. వాతావరణ ప్రతికూల ప్రభావం వలన వరిలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అగ్గి తెగులు వస్తున్నాయని వాటి నివారణ కొరకు సుడోమోనాస్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజు, రైతు సేవ కేంద్రం సిబ్బంది రేవతి, వెటర్నరీ అసిస్టెంట్ బాలు నాయక్ గ్రామ పెద్దలు జంగిటి రాజు యల్లావత్తుల గ్రామ సర్పంచ్ చంద్రమోహన్ రైతులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక