Connect with us

ఆంధ్రప్రదేశ్

సమగ్రాభివృద్ధికి పటిష్ట ప్రణాళిక – నగరపాలక అధికారులతో మంత్రి టి.జి. భరత్ సమీక్ష

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

• రహదారుల విస్తరణలు వేగవంతం చేయండి
• తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

నగరాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ అన్నారు. సోమవారం స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ముందుగా గతంలో నిర్వహించిన రెండు సమీక్షల నిర్ణయాలపై ఆరా తీశారు. నగరంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తప్పనిసరిగా చూపాలని, అందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట తాగునీరు సరఫరా చేసేందుకు సాధ్యమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా చేయాలని ఎస్ఎస్ ట్యాంకు వద్ద పంపింగ్ సామర్థ్యం పెంచాలని, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నారు. బుధవారపేటలో పార్కు ఏర్పాటు చేయాలని, కె.యి. మాదన్న నగర్ పాత డంపింగ్ యార్డు వద్ద గ్రీనరీ పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జగన్నాథ గుట్ట టిడ్కో వద్ద అంగన్‌వాడి కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్, పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 23, 24 వార్డులలో సుద్దవాగు వద్ద రక్షణ వలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి బాధితులతో మాట్లాడి త్వరగా పరిహారం అందించాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం నుండి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాధాకృష్ణ టాకీస్ మీదుగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు విస్తరణలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలుగు తల్లి కూడలి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంకల్ బాగ్, రాజు విహార్ ఎల్లమ్మ టెంపుల్ నుండి ఓల్డ్ టోన్ వరకు బండు రహదారుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిర్లా కాంపౌండ్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద మురుగు నీరు నిల్వ లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వీధి కుక్కల బెడద తగ్గించాలని, కొత్త ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. వీధి కుక్కలను పట్టే బృందాలను, ఆపరేషన్ థియోటర్లను పెంచాలన్నారు. పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని, సిబ్బంది సంఖ్య పెంచుకోవాలన్నారు. పరిశుభ్ర యంత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నూతన పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్నటువంటి వాటిని నిర్వాహణ సక్రమం నిర్వహించేలా చూడాలన్నారు. తాత్కాలిక (పూడికతీత) పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, హాజరుపై ఆరా తీశారు.

కార్యక్రమంలో కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, ఎస్ఈ జి.రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈ సత్యనారాయణ, ఆర్ఓలు ఇజ్రాయెల్, జునైద్, మేనేజర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580446
Total Users : 48130