ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల జిల్లా కేంద్రంలో యెహోవా ఈరే పవర్ టెంపుల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ నేగల జాషువా కు వరల్డ్ బుక్ గుర్తింపు రావడం నంద్యాల క్రిస్టియన్ మైనార్టీలకు సంతోషకరమని ఐక్యవేదిక రాష్ట్ర ఉప అధ్యక్షులు ఆకుమల్ల అబ్దుల్ రహీం అన్నారు. ఈ కార్యక్రమం తెలుగు ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ జానయ్య మన్నెం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతలు రెవరెండ్ డాక్టర్ నేగల జాషువా మరియు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న సాంసృతిక విభాగపు జిల్లా కన్వీనర్ శివరామీ రెడ్డి ,క్రిస్టియన్ జేఏసీ టీమ్ లీడర్స్ పాస్టర్ రాజన్, సుబ్బారావు, నైవేద్యం, ఆరోరా, ప్రేమ్ కుమార్ బ్రదర్ గడ్డం సుబ్బరాయుడు, ఆచారి, సురేష్, రాముడులను ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ & చిరు వ్యాపారుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ,నంద్యాల పట్టణ అధ్యక్షులు వాసు,ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు , శివ శంకర్ ,చంద్రపాల్,చాబోలు ఆరిఫ్, మదార్ వళి , సంజీవ రాజు, నబి రసూల్ , నాగేశ్వర రావు, అన్వర్ హుస్సేన్ , ఛాబోలు శివ నారాయణ ,మరియు ఆల్ మదధ్ కంప్యూటర్ సెంటర్ ఇన్చార్జి రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా రెవరెండ్ డాక్టర్ నేగల జాషువా మాట్లాడుతూ భారత దేశంలో అనేక మతాలు కులాల వారు కలిసి మెలిసి సోదర భావంతో,స్నేహ భావంతో జీవిస్తున్నారని అన్నారు .అందుకే మన దేశాన్ని ప్రజాస్వామ్య , లౌకిక దేశముగా చెప్పు కొంటున్నమని,అందులో భాగంగానే నేడు నాకు హిందూ సోదరులు,ముస్లిం సోదరులు కలిసి సన్మానించడం లౌకిక వాదానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల అబ్దుల్ రహీమ్ మాట్లాడుతూ జాషువా గారి సేవలను గుర్తించి ప్రపంచ స్థాయి లో అవార్డు రావడం సంతోషకరంగా ఉంది అని భవిష్యత్తులో సమాజానికి అవసరమైన మరిన్ని మంచి పనులు చేసి గొప్ప గొప్ప పురస్కారాలు అందుకోవాలని నంద్యాల జిల్లా కేంద్రంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యత ఇలాగే వర్ధిల్లాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక