ఆంధ్రప్రదేశ్
పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పేద. రైతుల పంట పొలాలపై సాగిస్తున్న దౌర్జన్యం పై చట్టపరమైన చర్యలు చేపట్టాలి.సిపిఐ.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సోలార్ కంపెనీ యాజమాన్యం పేద రైతులపై దౌర్జన్యం చేసి పంట సాగులో ఉన్న పొలాలను స్వాధీనం చేసుకునేందుకు రైతులపై దౌర్జన్యం చేస్తూ జెసిబి లతో పంట పొలాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యని గ్రీన్ కు సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు. సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎన్ రంగనాయుడు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు .
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ
నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు కొరకు చట్టబద్ధంగా భూ సేకరణ చేయకుండా, 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టి రైతులను బెదిరించి రైతుల నుండి భూములను తక్కువ రేటుతో వారికి డబ్బులు ఇచ్చి బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమని అన్నారు. పట్టా భూములకు ఎకరాకు ఆరు లక్షల నుండి 8 లక్షల వరకు ఇచ్చి పాణ్యం మాజీ ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారన్నారు.అప్పటి డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి రాజకీయ నాయకుల అండదండలతో గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పిన్నాపురం గ్రామంలోని పేద రైతుల పైన తన దౌర్జన్యాన్ని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం అమానుషమని అన్నారు
పిన్నాపురం గ్రామంలోనే పేద రైతులు గత 80 సంవత్సరాలుగా తమ తాత, ముత్తాతల నుండి ప్రభుత్వ భూములను, పంటలకు అనువుగా ఉన్న ఫారెస్ట్ భూములను సాగు చేసుకుని వివధ పంటలు వేసుకొని జీవిస్తున్నారు అన్నారు. 2024వ సంవత్సరం (ఈ సంవత్సరం) కూడా తమ సాగులో ఉన్న ప్రభుత్వ భూములలో రైతులు కంది ఇతర పంటలు వేయడం జరిగిందని రైతులు వేసిన పంటలను గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం జెసిబి లతో దౌర్జన్యంగా తొలగించిందని తెలిపారు. రైతుల పంటలను ధ్వంసం చేసి పంట భూములలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మించారని వీటిపై ప్రశ్నించిన రైతుల పైన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
వెంటనే జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు పర్యటించి పిన్నాపురం లో జరిగిన సంఘటనను పరిశీలించి జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా, రైతులపై దౌర్జన్యం చేస్తున్న గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైనచర్యలు చేపట్టి చట్టబద్ధంగా , రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా, సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు పట్టాలు ఇప్పించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక