Connect with us

ఆంధ్రప్రదేశ్

పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పేద. రైతుల పంట పొలాలపై సాగిస్తున్న దౌర్జన్యం పై చట్టపరమైన చర్యలు చేపట్టాలి.సిపిఐ.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సోలార్ కంపెనీ యాజమాన్యం పేద రైతులపై దౌర్జన్యం చేసి పంట సాగులో ఉన్న పొలాలను స్వాధీనం చేసుకునేందుకు రైతులపై దౌర్జన్యం చేస్తూ జెసిబి లతో పంట పొలాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యని గ్రీన్ కు సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు. సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎన్ రంగనాయుడు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు .
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ
నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు కొరకు చట్టబద్ధంగా భూ సేకరణ చేయకుండా, 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టి రైతులను బెదిరించి రైతుల నుండి భూములను తక్కువ రేటుతో వారికి డబ్బులు ఇచ్చి బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమని అన్నారు. పట్టా భూములకు ఎకరాకు ఆరు లక్షల నుండి 8 లక్షల వరకు ఇచ్చి పాణ్యం మాజీ ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారన్నారు.అప్పటి డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి రాజకీయ నాయకుల అండదండలతో గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పిన్నాపురం గ్రామంలోని పేద రైతుల పైన తన దౌర్జన్యాన్ని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం అమానుషమని అన్నారు
పిన్నాపురం గ్రామంలోనే పేద రైతులు గత 80 సంవత్సరాలుగా తమ తాత, ముత్తాతల నుండి ప్రభుత్వ భూములను, పంటలకు అనువుగా ఉన్న ఫారెస్ట్ భూములను సాగు చేసుకుని వివధ పంటలు వేసుకొని జీవిస్తున్నారు అన్నారు. 2024వ సంవత్సరం (ఈ సంవత్సరం) కూడా తమ సాగులో ఉన్న ప్రభుత్వ భూములలో రైతులు కంది ఇతర పంటలు వేయడం జరిగిందని రైతులు వేసిన పంటలను గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం జెసిబి లతో దౌర్జన్యంగా తొలగించిందని తెలిపారు. రైతుల పంటలను ధ్వంసం చేసి పంట భూములలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మించారని వీటిపై ప్రశ్నించిన రైతుల పైన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
వెంటనే జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు పర్యటించి పిన్నాపురం లో జరిగిన సంఘటనను పరిశీలించి జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా, రైతులపై దౌర్జన్యం చేస్తున్న గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైనచర్యలు చేపట్టి చట్టబద్ధంగా , రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా, సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు పట్టాలు ఇప్పించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580406
Total Users : 48090