ఆంధ్రప్రదేశ్
లబ్దిదారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ..

ఏపీ టుడే న్యూస్, పత్తికొండ:
పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ఇంటి వద్దకే వెళ్లి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు.
మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను లబ్ధిదారులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తలారి గంగమ్మ అనే మహిళతో మాట్లాడుతూ నీకు ఎంతమంది సంతానం వారు ఏం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి అడుగగా నాకు ఇద్దరు కుమారులు అని తెలుపగా వారు ఏ వృత్తిలో ఉన్నారని అడుగగా పెద్ద కుమారుడు ఐటిఐ చదివాడని, చిన్న కుమారుడు పదవ తరగతి చదివి బాడుగ ఆటో ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నానని తెలిపారు. రోజుకు ఆటో ద్వారా ఎంత మేరకు సంపాదిస్తున్నావు అని సిఎం అడుగగా రోజుకు సుమారు రోజుకు 200-250 వరకు సంపాదిస్తున్నానని తెలిపారు. అనంతరం వారి ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఏ పంట వేశారని ముఖ్యమంత్రి అడుగగా ప్రస్తుతం శనగ పంట వేశామని తెలిపారు. మీకు వితంతు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని సిఎం తెలుపగా గతంలో వితంతు పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చే వారని మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల బకాయిలతో పాటు జూలై నెల పెన్షన్ ఏడు వేల రూపాయలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐటిఐ చదివిన విద్యార్థికి ఒప్పంద ప్రాతిపదికన ఏదైనా ఉపాధితో పాటు ఇల్లు కూడా మంజూరు చేయాలని గంగమ్మ ముఖ్యమంత్రిని కోరగా వెంటనే ఇల్లు మంజూరు చేయడంతో పాటు రెండవ కుమారుడికి ఎలక్ట్రికల్ ఆటో అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ను అదేశించారు. అదే విధంగా ఐటిఐ పూర్తి చేసిన అబ్బాయికి కూడా నైపుణ్య పరంగా మెళకువలు నేర్చుకోవాలని సిఎం సూచించారు. అంతేకాకుండా ఇంట్లోని మహిళలు అందరూ పొదుపు సంఘాలలో ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకొని గతంలో పొదుపు సంఘాల ప్రారంభించి మహిళలను ఆర్థికంగా పైకి వచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం లబ్ధిదారురాలు తలారి గంగమ్మకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ను నేరుగా ముఖ్యమంత్రి అందజేశారు.
తలారి గంగమ్మ కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి, పత్తికొండ శాసనసభ్యులకు శాలువ అందజేశారు.చింతగింజల వెంకటేష్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ ను అందజేస్తూ మీకు ఎంత వ్యవసాయ భూమి ఉంది ? ఏ విధంగా జీవన ఉపాధి పొందుతున్నారు అని అడుగగా నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని దాని ద్వారా ఉపాధి పొందుతున్నానని వ్యవసాయ పనిముట్ల కొనుగోలు ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నాయని, కూలీలు కూడా ఎక్కువ శాతం నగదు అడుగుతున్నారని తెలిపారు. వ్యవసాయానికి సరిపడా నీరు తక్కువగా ఉన్నాయని తెలుపగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నాకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద 4వేల రూపాయలు అందుతున్నాయని, నా భార్యకు కూడా అభయ హస్తం పథకం క్రింద ఐదు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా నా కుమారుడికి ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా వీరి కుమారులు ఏ వృత్తిలో ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా వారిని అడిగి తెలుసుకొని వారి యోగ క్షేమాలు పట్ల అరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులు అందరితో గ్రూప్ ఫోటో దిగి చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్ 4వేలు, భార్య చింతగింజల ఉచ్చూరమ్మకు అభయ హస్తం పథకం క్రింద ఐదు వందల రూపాయలు నేరుగా ముఖ్యమంత్రి అందజేశారు. చివరిగా కుటుంసభ్యులు అందజేసిన పాలు త్రాగి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
అనంతరం గ్రామంలో రూ.2.83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్.ప్రద్యుమ్న, సెర్ఫ్ సిఈఓ జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక