ఆంధ్రప్రదేశ్
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్య సిబ్బందిని ఆదేశించారు.
కోడుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జనరల్ వార్డు, ప్రసవాల వార్డులను పరిశీలించారు..రోగులతో మాట్లాడారు..వైద్యసేవలు బాగా అందుతున్నాయా అని ఆరా తీశారు.. కేసు షీట్ లను పరిశీలించారు.. గర్భిణీ స్త్రీలకు సంబంధించి నెలకు ఎన్ని కేసులు వస్తాయని కలెక్టర్ వైద్యులను ప్రశ్నించారు..సుమారుగా 40 కేసులు వస్తాయని వారు తెలిపారు.. ఏఏ మండలాల నుంచి రోగులు ఎక్కువగా వస్తారు అని అడిగి తెలుసుకున్నారు..కోడుమూరు, గూడూరు, సి.బెలగల్, దేవనకొండ మండలాల నుండి రోగులు ఎక్కువగా వస్తారని వైద్యులు జిల్లా కలెక్టర్ కు వివరించారు..డా.ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మందులు పంపిణీ చేసే డిస్పెన్సరీని పరిశీలించారు. గడువు తేదీ ముగిసిన మందులు రోగులకు ఇవ్వకూడదని, ఒకటికి రెండుసార్లు గడువు తేదీని చెక్ చేసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నాగరాజు, వైద్య సిబ్బంది ఉన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక