ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎం.ఎస్.ఓ, ఎఫ్.ఎన్.ఓ, స్ట్రక్చర్ బేరర్స పోస్టుల భర్తి కై మంత్రికి వినతి

ఆసుపత్రి లో ఎం.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ.లు, స్ట్రక్చర్ బేరర్స్ కనీసం 100 మంది కూడా లేని పరిస్థితి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
న్యాయం ప్రతినిధి కర్నూలు అక్టోబర్ 25:కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు కనీసం 350 ఎం.ఎస్.ఓ, ఎఫ్.ఎన్.ఓ.లు, స్ట్రక్చర్ బేరర్స్ పోస్టులను భర్తీ చేయాలని శుక్రవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడానికి వచ్చిన కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి టి జి భారత్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శాఖ అధ్యక్షుడు బాలు నాయక్ తెలియజేశారు
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సుమారు 1590 బెడ్స్ ఉన్నాయని అలాగే రోగుల సంఖ్యని సంఖ్యనుబట్టి నర్సింగ్ స్టాఫ్ సుమారు 650 మంది, శానిటేషన్ వర్కర్లు 350 మంది, సెక్యూరిటీ గార్డ్స్ 250 మంది ఉన్నారు. కానీ ఎం.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ.లు, స్ట్రక్చర్ బేరర్స్ కనీసం 100 మంది కూడా లేని పరిస్థితి నెలకొంది.
అందువల్ల వార్డులలో, ఆపరేషన్ థియేటర్లల, ఒ.పి.లలో ఇప్పుడు ఉన్న పనివారిలో ఒక్కొక్కరు మూడు, నాలుగు వార్డులలో ఒత్తిడితో పని చేయుచున్నారు. దీనివల్ల పేషెంట్లను వారితోపాటు వచ్చిన రోగుల బందువులే స్ట్రక్చర్లతో తీసుకపోతున్నారు.
ఇప్పుడు ఉన్న బెడ్స్ సంఖ్యను బట్టి కనీసం 350 మంది ఎం.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ.లు, స్ట్రక్చర్ బేరర్స్ ఉంటేనే పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా పని చేయగలుగుతారు. ఆసుపత్రికి, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతారు.
కాబట్టి కనీసం 350 మంది ఎం.ఎన్. ఓ, ఎఫ్.ఎన్.ఓ.లు, స్ట్రక్చర్ బేరర్స్ పోస్టులను భర్తీ చేయగలరని దీనివల్ల పేషెంట్లకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో
శాఖ అధ్యక్షుడు.ఎన్.బాలు నాయక్ శాఖ ట్రెజరర్ కె.సురేష్ మరియు ఉరుకుందయ్య. శ్రీనివాసులు. నరసింహులు. శశిరెడ్డి. రమేష్. చిన్నయ్యదాస్. మళ్లీకార్జున. పి రాజు. సంజీవయ్య. శివన్న. రాజు. లోకేశ్వరరావు. నూర్అహ్మద్. సుశీలమ్మ. సుగుణమ్మ. స్వర్ణలత. భాగ్యమ్మ. గీతా కళ్యాణి. జయలక్ష్మి. మంగమ్మ. రమణమ్మ. మారమ్మ. తదితరులు పాల్గొనడం జరిగింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక