ఆంధ్రప్రదేశ్
పెద్దపాడు గ్రామంలోని వడ్లోని వంకభూమి సమస్య పరిష్కారంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలి.

కాలయాపన చేస్తే ఆర్డిఓ కార్యాలయం దిగ్బంధనం చేస్థాం. సిపిఎం
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో వంకను పూడ్చి ఫ్లాట్లు వేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ డిమాండ్ చేశారు ఈరోజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే మధు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది వడ్లోని వంకను ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వంక భూమిని యధా విధంగా ఉంచి వంక వంక ద్వారా నీరు కిందికి పోయే విధంగావిధంగా చర్యలు తీసుకోవాలని ,వంక భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు నశించాలని, దళిత వాడను రక్షించాలని, స్కూలు ,హాస్టల్ విద్యార్థులను విషపురుగుల నుండి కాపాడాలని ,ఆర్డిఓ గారు వచ్చి మా సమస్య వినాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు వంక భూమి సమస్యను పరిష్కరించకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు వంక భూమిని ఆక్రమించుకొని ప్లాట్లు వేయడం వలన దళితవాడలేకి నీరు ప్రవేశించి సుమారు 130 ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించి దళిత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక స్కూలు హాస్టల్ లోకి నీళ్లు ప్రవేశించి పాములు తేళ్లు స్వైర విహారం చేస్తున్నాయని వాటి నుండి పిల్లలను రక్షించాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదని అటువంటి అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉండడం హేయమైన చర్య అని ఆయన దుయ్యబడ్డారు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే ఆర్డీవో కార్యాలయం దిగ్బంధనం చేస్తామని ఆ సందర్భంలో జరగబోయేటువంటి సంఘటనలకు జిల్లా అధికారుల బాధ్యత అని ఆయన హెచ్చరించారు ఇప్పటికే తాసిల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు అర్జీలు ఇచ్చాము ఆందోళన చేసాము అయినా చలనం లేదు ఎందుకని ప్రభుత్వ అధికారులు కదలడం లేదు సమాధానం చెప్పాలని గట్టిపట్టుపట్టారు ఆర్డిఓ గారు రాకపోవడం చేత కార్యాలయం లోకి ప్రవేశించడం కోసం ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్సై మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని ఆందోళనకారులను నిలువరించి మీరు వినతి పత్రం ఇయ్యండి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దామని ఆయన చెప్పడంతో సద్దుమణిగింది ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ఏ.వో
వేణు గోపాలరావుకు వినతిపత్రం ఇచ్చి మీరు సమస్య ఎన్ని రోజులలో పరిష్కరిస్తారని అడిగారు ఆలస్యం చేయకుండా తొందరగా సమస్యను పరిష్కరిస్తామని నూటికి నూరు శాతం తప్పనిసరిగా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని ముగించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పెద్దపాడు శాఖ కార్యదర్శి గోపి, పందిపాడు శీను, పెద్దపాడు గ్రామస్తులు యేసు రాజు, చిన్న రాముడు, పెద్ద రాముడు, బజారి, రాజు, చిన్న భీమన్న పెద్ద భీమన్న,మౌలాలి, శీనుతదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక