Connect with us

Uncategorized

ప్రభుత్వాన్ని మెడలు వంచి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు పోరుబాటలో పాల్గొని విజయవంతం చేయండి… ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మున్సిపల్ చైర్ పర్సన్ మా బన్నీసా

Published

on

ప్రభుత్వాన్ని మెడలు వంచి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు పోరుబాటలో పాల్గొని విజయవంతం చేయండి… ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మున్సిపల్ చైర్ పర్సన్ మా బన్నీసా

ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు వైఎస్ఆర్సిపి చేపడుతున్న పోరు బాటలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యుత్ వినియోగదారులు ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, వై ఎస్ ఆర్ సి పి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, డిసెంబర్ 27వ తేదీన పార్టీ శ్రేణులు, ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయం లో ఆ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పిం సమర్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీ సా, వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమక్షంలో కరెంటు చార్జీల బాదుడుపై వైయస్సార్సీపి అనే పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విశాఖ భాషా మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలో రెండుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై పెను భారాన్ని మోపారన్నారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కంటే టిడిపి కూటమి ప్రభుత్వం మరింత మేళ్లను చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని, అయితే ప్రజల యొక్క నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వమ్ముచేసి దగా చేశారని విమర్శించారు. కూటమి నాయకులు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అబద్దాలతో అధికారంలో ఉండి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ..లేకున్నా..ప్రజలతో…ప్రజల కోసం ఉండే నాయకుడని, జననేత జగనన్న నాయకత్వంలో తామంతా నడుస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీ అన్ని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ పోరు బాటలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విద్యుత్ వినియోగదారులు, ప్రజానీకం హాజరై కూటమి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ శేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, దాల్మిల్ అమీర్ ,శశికళ రెడ్డి, కౌన్సిలర్స్ విజయభాస్కర్ మేస చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్ ,చంద్రశేఖర్ రెడ్డి, వార్డు వైసిపి నాయకులు లక్ష్మీనారాయణ ,కిరణ్ కుమార్ ,జాకీర్ హుస్సేన్, సాయిరాం రెడ్డి టీవి రమణ పున్న శేషయ్య ,ఎద్దు రవి, శంకర్ నాయక్ ,ఖాసిం, టైలర్ శివ, చింతా శ్రీనివాసులు, రామచంద్రుడు, కాల్వ నాగరాజు ,సోమశేఖర్ రెడ్డి, జలీల్ ,పైలెట్ ,కైప గోపాల్ రెడ్డి, శ్రీరాములు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580176
Total Users : 47860