ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ

ప్రకాశం జిల్లా / కనిగిరి ఏపీ టుడే న్యూస్ జనవరి 2
కనిగిరి ఆర్టీసీ డిపో కండక్టర్ ఎం మహేశ్వరి ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న నగదు ఉన్న పర్సు తిరిగి డిపో మేనేజర్ సమక్షంలో అందజేసి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. కనిగిరి డిపో కు చెందిన పామూరు సర్వీస్ బస్సులో గురువారం పామూరు నుండి కనిగిరి కి ప్రయాణించిన ఒక ప్రయాణికురాలు బస్సులో పర్సు మరచిపోయి దిగిపోయింది.ప్రయాణికులందరు దిగిపోయిన తర్వాత బస్సులోని సీటులో పర్సును ఉండటాన్ని గమనించిన కండక్టర్ ఆ పర్సును తీసుకొని బస్టాండ్ లో సమాచార కేంద్రంలో ఉన్న కంట్రోలర్ కు అందజేశారు. బస్సులో పర్సును పోగొట్టుకున్నాను అని గమనించిన ప్రయాణికురాలు బస్టాండ్ కి వచ్చి విచారించగా కండక్టర్ కంట్రోలర్ వద్ద ఉన్నది అని చెప్పగా అది నా పర్సు అని ప్రయాణికురాలు చెప్పడం జరిగింది.వెంటనే కంట్రోలర్ డిపో మేనేజర్ కు, భద్రత విభాగం వారికి తెలియజేయడం జరిగింది.వెంటనే వారు వచ్చి ఆమె ప్రయాణించిన టిక్కెట్ ను పరిశీలించి విచారించి పర్సులో పోగొట్టుకున్న 9500 రూపాయలు ఆమెకు అందజేశారు.డిపో మేనేజర్ ఎస్.డి సయానా బేగం, ఆర్ టి సి హెడ్ కానిస్టేబుల్ ఎస్. కొండయ్య ఇతర అధికారులు తోటి సిబ్బంది కండక్టర్ నిజాయితీని ప్రత్యేకంగా ప్రశంసించారు. పోగొట్టుకున్న పర్సును నిజాయితీగా తిరిగి ఇచ్చినందుకు ఆర్టీసీ అధికారులకు సిబ్బందికి ప్రయాణికురాలు కృతజ్ఞతలు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక