ఆంధ్రప్రదేశ్
ఆరుగురు చిన్నారులు అదృశ్యం

*స్కూలుకు వెళ్ళడంలేదని తల్లిదండ్రులు మందలించారని ఆలమూరు మండలం ఖండ్రిగ పేటకు చెందిన 6 గురు విద్యార్దులు అదృశ్యం*
ఏపీ టుడే న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి ఆలమూరు (మార్చి 28) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు ప్రకారం ఆలమూరు ఖడ్రికపేటకు చెందిన 8 తరగతి, 7 తరగతులు చదువుతున్న కొమరిగిరి కరుణ(14), కొమరిగిరి పృథ్వి వర్మ(12), గంధం సత్యనారాయణ(13), మర్రి సంతోష్(14), కోమరిగిరి పండు(12), కోమరిగిరి మారుతి(12) అనే ఆరుగురు చిన్నారులు ఈనెల 24వ తేదీన అదృశ్యమయ్యారన్నారు.
పిల్లల తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆలమూరు ఎస్సై ఎం అశోక్ తెలిపారు.
*ఇదే విషయమై కొత్తపేట డి.ఎస్.పి సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ…*
ఆలమూరు మండలం ఖండ్రిగ పేట విలేజ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఈనెల 24వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయారు.
అందులో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఒకరు కజిన్ మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా వారి బంధువులు పిల్లలే అందరూ అదే పేటకు చెందిన పిల్లలు వీరందరూ జడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు.
వన్ మంత్ నుండి సరిగా స్కూల్ కి వెళ్ళకపోవడంతో స్కూల్ కి వెళ్తున్నామని చెప్పి తోటల్లో ఆడుకుంటూ స్కూల్ సమయం తర్వాత ఇంటికి వస్తున్నారని తెలియడంతో తల్లిదండ్రులు మందలించడంతో 24వ తేదీ సాయంత్రం వారి ఇళ్లలో నుచి బయటికి వెళ్లిపోయారు.
ఒక అబ్బాయి తన ఇంట్లో 3000 రూపాయలు క్యాష్ తీసుకుని వెళ్లిపోయాడు. మిగిలిన పిల్లలు ఎవరు ఏమి తీసుకుని వెళ్ళలేదు
పిల్లల తల్లిదండ్రులు ఈరోజు వరకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా వారి బంధువుల దగ్గర వారి వృత్తి ఫిషింగ్ ఆవడంతో వారికి తెలిసిన వారు ఇళ్ల దగ్గరికి ఎక్కడికైనా వెళ్లారేమో అని వెతకడం ప్రారంభించారు.
ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఈరోజు ఆలమూరు పోలీసుల్ని పిల్లల తల్లిదండ్రులు ఆశ్రయించారు.
పిల్లలు ఎవరి దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు సో పిల్లలు ఎక్కడికి వెళ్లారు అని తెలియకపోవడంతో కొన్ని టీం లు ఏర్పాటు చేసి విజయవాడ ఒకటి టీం, రాజమండ్రి విశాఖపట్నం ఒక టీం ను పంపించడం జరిగింది.
అలాగే రావులపాలెం బస్టాండ్ పరిసర ప్రాంతాలను మండపేట పరిసర ప్రాంతాలను సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరుగుతుంది రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందని తెలిపారు.
పిల్లల ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు తెలియపరచాలని, ఎస్సై 9440904849, రూరల్ సీఐ 9440796527. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషం అందిస్తామన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక
-
ఆంధ్రప్రదేశ్2 months ago
స్పందన సుబ్బరామిరెడ్డి ఇకలేరు…