ఆంధ్రప్రదేశ్
జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హెల్త్ డే కార్యక్రమం

జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హెల్త్ డే కార్యక్రమం
నాగేంద్రుడు
ఏపి టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హెల్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఎం.డి & సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బీపీ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని అలాగే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా మంచి ఆహారము తీసుకోవాలని,, అవసరమైనంత సమయం నిద్ర పోవాలని సూచించారు. వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, ఇటువంటి సూత్రాలు పాటిస్తే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునన్నారు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ డే ను డిక్లేర్ చేసిందని. ప్రతి ఏడాది ఏప్రిల్ 7 న వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నామని. రోగులకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పేషెంట్ కు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే నాలుగు గంటల లోపల సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైన ఇంజక్షన్ వేయిస్తే పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని, దానినే గోల్డెన్ అవర్స్ అని అంటారని డాక్టర్ నిశాంత్ రెడ్డి తెలిపారు, డాక్టర్ శృతి గైనకాలజిస్ట్ మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరము తల్లి బిడ్డ క్షేమం (మెటర్నల్ హెల్త్) గురించి తీసుకున్నారు. తల్లి బిడ్డ క్షేమం గురించి ఆమె మాట్లాడుతూ సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి, రెగ్యులర్ చెకప్, యోగా చేయాలన్నారు. ప్రతి నెలా రెండవ శనివారము జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో యాంటీనైటల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రెగ్నెన్సీ మొదలు బిడ్డ పుట్టేంతవరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రతి గర్భిణీ స్త్రీ ఉపయోగించుకోవాలని డాక్టర్ శృతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ అథారిటీ సర్వీసెస్ సెక్రటరీ & సీనియర్ సివిల్ జడ్జ్ లీలా వెంకట శేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు, కార్యక్రమాన్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ నిర్వహించారు. కార్యక్రమంలో జెమ్ కేర్ హాస్పిటల్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రవిబాబు, సర్జన్ డాక్టర్ బాలమురళి, డాక్టర్ రామమోహన్ మెడికల్ సూపరింటెండెంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర, సి ఓ ఓ డాక్టర్ గణేష్, ఆపరేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నదీమ్, ఆపరేషన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక