ఆంధ్రప్రదేశ్
జవాబుదారీతనంతో సేవలు అందించండి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
కొత్తపేట మండలంలో ప్రజలందరికీ జవాబుదారీతనంతో అధికారులు తమ సేవలు అందించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మార్గాన్ని గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ మరికొన్ని రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డయేరియా వంటి వ్యాధులు ప్రభలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం వారికి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతోపాటు జింక్, ఓఆర్ఎస్ మందులు అందించాలని ఆదేశించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానిడిని బలంగా నమ్మి స్థానిక సంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధిక మొత్తంలో గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయిస్తున్నారని, జల్ జీవన్ నిధులు పక్కదారి పట్టడంతో ఆ పనులు మందకుడిగా సాగుతున్నాయని ఇకపై ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి అందించే దిశగా జల జీవన్ పథకం పనులను పూర్తి చేస్తామని అన్నారు. గ్రామ మండల స్థాయి అధికారులు బాధ్యతగా తమ విధులు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీరు, డ్రైన్, పారిశుధ్యం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఇకపై ప్రజల భాగ్యస్వామ్యంతో ప్రతి అభివృద్ధి పనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే గత ఐదేళ్లుగా నిధులు లేమితో సతమతమవుతున్న గ్రామపంచాయతీలు ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలతో ఇక నుండి మండల, గ్రామస్థాయికి సీనరేజ్ నిధులుతో అభివృద్ధి పనులు పరిగెడతాయని అన్నారు. అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలు చెప్పవచ్చునని బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జి రమాదేవి, వైస్ ఎంపీపీ బండారు సత్య మంగతాయారు, దంగేటి వెంకట నాగమణి ఎంపీడీవో కందుల వాణి, తాసిల్దార్, పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు తమ సేవలు అందించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మార్గాన్ని గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ప్రగతిని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ మరికొన్ని రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డయేరియా వంటి వ్యాధులు ప్రభలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం వారికి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతోపాటు జింక్, ఓఆర్ఎస్ మందులు అందించాలని ఆదేశించారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానిడిని బలంగా నమ్మి స్థానిక సంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధిక మొత్తంలో గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయిస్తున్నారని, జల్ జీవన్ నిధులు పక్కదారి పట్టడంతో ఆ పనులు మందకుడిగా సాగుతున్నాయని ఇకపై ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి అందించే దిశగా జల జీవన్ పథకం పనులను పూర్తి చేస్తామని అన్నారు.
గ్రామ మండల స్థాయి అధికారులు బాధ్యతగా తమ విధులు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీరు, డ్రైన్, పారిశుధ్యం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఇకపై ప్రజల భాగ్యస్వామ్యంతో ప్రతి అభివృద్ధి పనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అలాగే గత ఐదేళ్లుగా నిధులు లేమితో సతమతమవుతున్న గ్రామపంచాయతీలు ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలతో ఇక నుండి మండల, గ్రామస్థాయికి సీనరేజ్ నిధులుతో అభివృద్ధి పనులు పరిగెడతాయని అన్నారు. అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలు చెప్పవచ్చునని బండారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జి రమాదేవి, వైస్ ఎంపీపీ బండారు సత్య మంగతాయారు, దంగేటి వెంకట నాగమణి ఎంపీడీవో కందుల వాణి, తాసిల్దార్, పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక