ఆంధ్రప్రదేశ్
గురు పౌర్ణమి విశిష్టతను తెలియజేసిన ప్రియదర్శిని కాన్వెంట్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్రదేవ్

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
గురు పౌర్ణమి సందర్భంగా తమ గురువులను తోటి విద్యార్థులను ప్రియదర్శిని బాలవిహార్ కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్ర దేవ్ గుర్తు చేసుకున్నారు ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, త్రినోక్ గుహ పౌర్ణమి గా పిలవబడుతుందని వివిధ మతాల వాళ్ళు వాళ్ళ ఆచారం మతానుసారం వివిధ పేర్లతో పిలుచుకుంటారని తెలిపారు ఆరోజు తమకు విద్య బుద్ధులు నేర్పించిన గురువులను గుర్తు చేసుకోవడం వారిని కలుసుకొని వారి దీవెనలు తీసుకోవడం శుభప్రదమని తెలిపారు
1980 సెప్టెంబర్ 5 వ తేదీన గవర్నమెంట్ హైస్కూల్ కోత్తపేట రామకృష్ణ భవనం లో గురుపూజోత్సవం సందర్బంగా తీసిన నాటి తమ గురువుల చిత్రపటాన్ని స్నేహితుల సహాయంతో భద్రంగా పదిలపరుచుకున్నారు తాను ఈరోజు స్కూల్ పెట్టి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడిగా చేసిన ఘనత మా గురువులదేనని వారిని కొనియాడారు.
గురు పౌర్ణమి విశిష్టతను గురించి దేవ్ ఇలా తెలియజేశారు…
సారనాథ్ లోని మృగదావనంలో బుద్ధుడు తన తొలి ధార్మికోపన్యాసము చేసిన రోజు ఆషాఢ పూర్ణిమ ఆరోజు బుద్ధుడు తన శిష్యులకు చేసిన ఉపదేశము *ధర్మచక్రప్రవర్తన* గా ప్రపంచమంతటా వ్యాప్తి చెందిందని అప్పటినుండి బౌద్ధులు బుద్ధుణ్ణి తమ ఉన్నత ఉపాధ్యాయుడుగానూ, ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ గాను ప్రత్యేకంగా భావిస్తారని అది గురుపౌర్ణమి గా విశిష్టత చెందిందని తెలియజేశారు చరిత్రలో బుద్ధునికి ముందు గాని తర్వాత గాని తనకు తెలిసిన సమస్త జ్ఞానాన్నీ మానవాళి మొత్తానికి ఏవిధమైన షరతులు లేకుండా బోధించిన ఇలాంటి గురువు మరొకరు లేరని బౌద్ధుల ప్రగాఢ విశ్వాసం అని తెలియజేశారు.
వ్యాసుడు – మహాభారత రచయిత – పరాశర ఋషి మరియు ఒక మత్స్యకారుని కుమార్తె సత్యవతికి జన్మించిన రోజు ఇది; అందువలన, ఈ రోజును వ్యాస పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. వేదవ్యాసుడు తన కాలంలో ఉన్న అన్ని వేద స్తోత్రాలను సేకరించి, వాటి లక్షణాలు మరియు ఆచారాలలో ఉపయోగించడం ఆధారంగా వాటిని నాలుగు భాగాలుగా విభజించడం ద్వారా వేద అధ్యయనాల కారణానికి ఎంతో సేవ చేసాడు. తరువాత వాటిని తన నలుగురు ముఖ్య శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని మరియు సుమంతులకు బోధించాడు. ఈ విభజించడం మరియు సవరించడం వలన అతనికి గౌరవప్రదమైన “వ్యాస” (వ్యాస్ = సవరించడం, విభజించడం) లభించింది. అతను వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు, అవి ఋగ్, యజుర్, సామ మరియు అధర్వణ వేదాలు అని తెలిపారు.
జైన సంప్రదాయాల ప్రకారం, గురు పూర్ణిమను త్రీనోక్ గుహ పూర్ణిమ అని పిలుస్తారు, దీని ద్వారా ఒకరి ట్రీనోక్ గుహలు [స్పష్టత అవసరం] మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక పూజలు చేస్తారు. చాతుర్మాస్య ప్రారంభంలో రోజు వస్తుంది. ఈ రోజున, మహావీరుడు, కైవల్యాన్ని పొందిన తరువాత, గౌతమ స్వామిని తన మొదటి శిష్యుడిగా (గణధార) చేసాడు, తద్వారా తానే ట్రీనోక్ హుహా అయ్యాడు అని తెలిపారు.
సేకరణ : అద్దంకి బుద్ధ చంద్రదేవ్
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక