ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో బీసీల వర్గీకరణ చేపట్టాలి

తిరుపతి :-
ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమస్యకు చక్కని పరిష్కారం లభించింది .ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. ఎస్సి రిజర్వేషన్ వర్గీకరించి అదే వరుసలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక హోదాలు కల్పించడానికి పచ్చ జెండా ఊపింది. ఇట్టి తీర్పు చరిత్రకమైనదిగా భావిస్తూ మా సమాఖ్య తీర్పును స్వాగతిస్తూ తీర్మానించినది .ఎస్సీ వర్గీకరణ కొరకు ఎన్నో సంవత్సరాలుగా సాగించిన మాదిగ కుల సామాజిక వర్గం వారిని వారి నేత శ్రీకృష్ణ మాదిగను మా సమాఖ్య అభినందిస్తుంది. గతంలో చంద్రబాబు గారు తీసుకున్న చొరవతో నే నేడు వర్గీకరణ సాధ్యమైందని చెప్పక తప్పదు ఏది ఏమైనా వర్గీకరణ తీర్పు శుభపరిణామంగా మా సమాఖ్య భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలు అందరికీ అందవలసిన రిజర్వేషన్ ఫలాలు బీసీలలో కేవలం ఐదు లేక ఆరు కులాలు వారు మాత్రమే అనుభవిస్తున్నారు. స్థానిక సంస్థలందు రిజర్వేషన్లు వర్గీకరణ లేకపోవడంతో ఎంబీసీలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది బీసీలలో అత్యధిక శాతం ఎంబీసీ కులాలు చట్టసభల్లోకి వెళ్లలేనిదుస్థితి ఏర్పడింది. కనుక బీసీల వర్గీకరణ జరుపవలసిన అవసరం ఎంతో ఉన్నది .బీసీల వర్గీకరణ అంశంపై త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము .రాష్ట్రంలో బీసీల వర్గీకరణ కూడా శ్రీ చంద్రబాబు గారితోనే సాధ్యం కాగలరని విశ్వాసంతో ఎంబీసీ సమాఖ్య నకు ఉన్నది. ఎంబీసీల సమాఖ్య రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం సరికి అందులో కార్యాచరణ నిర్ణయిస్తాము. రాష్ట్రంలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గీకరణ ప్రకారం ఎంబీసీలకు సీట్లు కేటాయించాలని నేటి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అవకాశం లభించని ఎంబీసీ కులాలకు విశాఖ విజయవాడ కాకినాడ తిరుపతి లాంటి నగరాలలో అభివృద్ధి సంస్థలకు చైర్మన్లు నియామకములందు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ దేవాలయ ధర్మాదాయ ట్రస్టు బోర్డు లాంటి ధార్మిక సంస్థలందు చైర్మన్ డైరెక్టర్ల పదవుల్లోనూ ఎంబీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఎంబీసీ సమాఖ్య ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. ఈ కార్యక్రమంలో గజేంద్ర వాల్మీకి ,గుణశేఖర్ ముదిరాజ్ ,కోదండ రెడ్డి పల్లి రెడ్డి ,బలరాం ముదిరాజ్ , కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్, పి ధర్మాచారి విశ్వబ్రాహ్మణ, బాబు రాజేంద్రప్రసాద్ గాండ్ల, కుమ్మర గంగులప్ప, విజయ్ కుమార్ కంసాలి, నాగార్జున రావు, గజేంద్ర వాల్మీకి, పి వెంకటేష్ రజక, కొత్తకోట రవి రజక పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక