ఆంధ్రప్రదేశ్
కోనసీమ బాలోత్సవం లో విజేతలుగా నిలిచిన ప్రియదర్శినీ బాలవిహార్ చిన్నారులు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
మనం ట్రస్ట్ మరియు జితేంద్ర సేవాసంస్దలు సంయుక్తంగా డా॥బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బాలుర పాఠశాలలో 10, 11 తేదీలలో వివిధ స్థాయిలలో 32 అంశాలలో 3 విభాగాలలో నిర్వహించిన కోనసీమ బాలోత్సవం మొదటి పిల్లల పండుగలో ప్రియదర్శినీ బాలవిహార్ నుండి 26 విభాగాలకు 125మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 40 మంది విద్యార్థినీ విద్యార్థులు ( గ్రూప్ సింగింగ్, నాటిక, సోలో పెర్ఫార్మన్స్) మొత్తం కలిపి 3 ప్రథమ, 3 ద్వితీయ, 4 తృతీయ స్థానాలలో నిలచి పది బహుమతులు స్వంతం చేసుకున్నారు. నిర్వాహకులు, ముఖ్య అతిథులు వీరికి జ్ఞాపికలు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందచేసారు. మిగిలిన 85 మందికి నిర్వాహకులు పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చారు.
సబ్ జూనియర్స్ విభాగంలో చిత్రలేఖనం అంశంలో ఎస్ హంసిక ప్రథమ స్థానంలో నిలిచింది.
జూనియర్స్ విభాగంలో మ్యాప్ పాయింటింగ్ అంశంలో కెవై అనురాగ్ తృతీయ స్థానంలో నిలిచాడు. అదే విభాగంలో దేశభక్తి బృంద గీతాలపన అంశంలో విఎన్వి సూర్యశ్రీ, ఎస్ ఎస్ ఎస్ లక్ష్మి, పి ఎన్ వైష్ణవి, వి సత్యశ్రీ, పి హరిణిదేవి, ఎస్ కె సౌమ్య, పిఎన్నెస్ పల్లవి, వై శ్రీదేవి తృతీయ స్థానంలో నిలిచారు. అదే విభాగంలో జానపదం బృంద గీతాలాపన అంశంలో పి జిగర్, డిడి కార్తికేయ, వై ఆర్ సతీష్, సిహెచ్ విమల్, సిహెచ్ విఎస్కె ప్రియ, ఎఎస్ దీక్షిత, డివిఎస్సెస్ లక్ష్మి, సిహెచ్ ఎసెస్పి సహస్ర, ఎఎఎసెస్ హాసిని, సిహెచ్ పి విహారిక ద్వితీయ స్థానంలో నిలిచారు.
సీనియర్స్ విభాగంలో కథా విశ్లేషణ అంశంలో ఎస్ ప్రణీత ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విభాగంలో వార్తా రచన అంశంలో బి అమృత వర్షిణి ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే విభాగంలో మట్టితో బొమ్మలు అంశంలో సిహెచ్చార్ సతీష్ నాయుడు ద్వితీయ స్థానంలో నిలిచాడు. అదే విభాగంలో కథా రచన అంశంలో బి శ్రావణి భవాని తృతీయ స్థానంలో నిలిచింది. అదే విభాగంలో జానపదం బృంద గీతాలాపనలో కె మహిత, సిహెచ్ ఎల్ సౌజన్య, ఎస్ ప్రణీత, కెఎల్ చంద్రిక, ఎస్ ఆర్ అలేఖ్య, పి కావ్య, డిఎస్ అనూష, బి అమృత వర్షిణి, డిఎస్ అలేఖ్య ప్రథమ స్థానంలో నిలిచారు. అదే విభాగంలో లఘు నాటిక అంశంలో ఎన్ అభిర్వై, ఎం ఆదిత్య కృష్ణ, కెవివిఎస్ శేఖర్, జె ప్రణీత, జి యామిని, ఆర్వి దుర్గ, బి ప్రదీప్ చందు తృతీయ స్థానంలో నిలిచారు.
పోటీలలో పాల్గొన్న అందరినీ ముఖ్యఅతిథి శాసనసభ్యులు బండారు సత్యానందరావు, సర్పంచి బూసి జయలక్ష్మి, ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి రాజకుమార్ వడయార్, మండల విద్యాశాఖాధికారి మట్టపర్తి హరిప్రసాద్, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, మండల వినియోగదారుల సంఘం అధ్యక్షులు సత్తిరాజు ఆదిత్య కిరణ్, బాలోత్సవ్ నిర్వాహకులు జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్, అధ్యక్షులు కాశీ విశ్వనాథం, మనం ట్రస్ట్ ఇన్ చార్జ్ ఎండూరి పవన్, చైర్మన్ కె వీరబాబు తదితరులు అభినందించారు.
ప్రియదర్శినీ బాలవిహార్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్, అకడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య పోటీలలో పాల్గొన్న తమ విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. వారికి తర్ఫీదునిచ్చి, పోటీలకు హాజరు పరచిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎఎస్సార్ మూర్తి, ఐ ఇందుభార్గవి, బి నానీ కుమారి, పి సత్యవేణి, ఎ ధనలక్ష్మి, కె అనూష, ఎన్ శ్రీలక్ష్మి, వి రమ్య, ఆయా ఎన్ లక్ష్మి లకు మరియు కోనసీమ బాలోత్సవ్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక