ఆంధ్రప్రదేశ్
ఆగస్టు 19న ఆందోళన కార్యక్రమం సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర పిలుపు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆగస్టు 19న ప్రజారోగ్యంకై పన్నుల దంపుడును వ్యతిరేకిస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు.
నేడు స్థానిక పెన్నా నగర్ నందలి సిపిఐ కార్యాలయంలో ఏరియా జనరల్ బాడీ సమావేశం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ రోగాల సీజన్లో ముందస్తు జాగ్రత్తలు లేకుండా జిల్లా ప్రజారోగ్యం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేయడం మూలంగా ప్రజలు తీవ్రమైన జ్వరాలు బారిన పడ్డారని అయినా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని వారన్నారు. జ్వర పీడితులు వైద్య పరీక్షలకే వేల రూపాయలు దార పోసే పరిస్థితి నెలకొనిందని దీనిని ప్రజా ప్రతినిధులు ఎందుకు అరికట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే పన్నులపై ఇష్టానుసారంగా ఆయా లోకాల్టీలను బట్టి పెంపుదలను చేసి సామాన్యులపై పన్నుల దంపుడు చేశారని దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలని ఆ మేరకు ఆగస్టు 19న జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్ మరియు కార్పొరేషన్ మరియు నగర పంచాయతీ కార్యాలయాల ఎదుట సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టాలని ప్రజారోగ్యంకై ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
నిన్నటి దినం జిల్లా ఆసుపత్రిలో వెదురూరు గంగరాజు ఆత్మహత్య చేసుకుంటే జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారని దీనికి బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ప్రజలకు బాధ్యతగా ఉంటామని అధికారులు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాడర్ స్ట్రెంగ్త్ను కోత ముదించడం మూలంగానే ఈ పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంతమంది సిబ్బందిని నియామకం చేపట్టి ఉన్నటువంటి సిబ్బందికి పని భారం తగ్గించాలని ప్రభుత్వ ఆసుపత్రుల పరిరక్షణకై ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిర్మాణానికి నాంది పలకాలని పితుకు పలికారు. ప్రొద్దుటూరు పాలకేంద్రం తిరిగి ఏర్పాటుకు కృషి చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య వెంకట శివ, ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు సమితి సభ్యులు చంద్రశేఖర్ శివారెడ్డి వై హరి ప్రమీల వీరయ్య శెట్టి మచ్చ శీను తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక