ఆంధ్రప్రదేశ్
కృషి విజ్ఞాన కేంద్రం కుప్పం రైతులకు ఓ వరం…
కుప్పం:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రం రావడం కుప్పం రైతులకు వరం లాంటిదని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ…రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని కుప్పం రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకువచ్చారని, ఈ కేంద్రం ద్వారా నూతన పరికారాలతో వ్యవసాయాన్ని ఎలా చేయాలన్న దానిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కేంద్రీయ విద్యాలయాన్ని కుప్పంకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ కు స్థలాన్ని ఎంపిక చేసిందని అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఒక ఇటుక కూడా వేయలేదని మండిపడ్డారు. అప్పట్లో కార్గో ఎయిర్పోర్ట్ కు 500 ఎకరాలను సేకరించామని, ఎన్డీఏ ప్రభుత్వంలో 1100 ఎకరాల్లో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్ రావడంతో పరిశ్రమలు వస్తాయని ఆ పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువత కోసం 2 వేల ఎకరాలలో పరిశ్రమ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 500 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కు, 500 ఎకరాల్లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్, మరో 500 ఎకరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్, మిగిలిన 500 ఎకరాలు పలు పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయనున్నట్లు చెప్పారు. 30 నుంచి 40 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. జమీందారు కుటుంబంకులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పి.ఎస్ మునిరత్నం, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, తహసీల్దార్ చిట్టిబాబు, ఎంపీడీవో సాయి లహరి, కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక ప్రజలు, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68093