Connect with us

ఆంధ్రప్రదేశ్

చంటి పిల్లలను పెంచిన తరహాలో మొక్కల పెంపకాన్ని చేపట్టండి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత సమిష్టిగా తీసుకోవాలి.

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్.


ప్రతి ఒకరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలను సమిష్టిగా తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూనేపల్లెలోని నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన 75వ వన మహోత్సవ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారులు రామకృష్ణ, బిఎన్ఎన్ మూర్తి, అటవీ శాఖ డిడి అనురాగ్ మీన, డిఎఫ్ఓ శివ శంకర్ రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్, 21వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత సమిష్టిగా తీసుకోవాలని సూచించారు. 1984లో కూడా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరవిగా చేపట్టారన్నారు. 1995, 96 లో తాను మునిసిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి శనివారం శ్రమదానం పేరిట పరిశుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నంద్యాల నుంచి కర్నూలు, ఆళ్లగడ్డ వెళ్లే ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా అంతా చింత చెట్లు విరివిగా ఉండేవని ప్రజా అవసరాల నిమిత్తం చెట్లను తొలగించేసి నాలుగు లైన్ల రహదారులను నిర్మించుకున్నామన్నారు. భారతదేశ ఖనిజ సంపద కాపాడేందుకు 1971లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఐఎఫ్ఎస్ ను ఏర్పాటు చేసి పార్లమెంటులో అమెండ్మెంట్ తీసుకొచ్చారన్నారు. అటవీ ప్రాంతంలో రాక్ ఫిల్లింగ్ డ్యాం ఏర్పాటు చేసేందుకు అన్వేషించామన్నారు. ప్రాచీన కాలంలో అశోకుడు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించారని అదే తరహాలో అవకాశం ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు విరివిగా నాటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలో 9.64 లక్షల హెక్టార్ల భూమి ఉందని అందులో 3.14 లక్షల హెక్టార్లలో 32.8 శాతం పర్యావరణ సంబంధమైన అటవీ భూముల విస్తీర్ణం వుండి మన నంద్యాల జిల్లా అదృష్టం చేసుకుందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత సంవత్సరం భూగర్భ జలాల నీటిమట్టం దిగువకు పోవడం వల్ల నీటి కొరత ఏర్పడిన11 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశామన్నారు. చంటి పిల్లలను ఏవిధంగా పెంచుతామో అదేవిధంగా మొక్కలను కూడా పెంచి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించి జిల్లాలో వాటర్ టేబుల్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు వనంలా పెంచితే భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి జీవవైవిధ్యంలో సమతుల్యత ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నేటి నుండి ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమం కార్తీక పౌర్ణమి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. మెడికల్ కాలేజీ ఆవరణంలో 1500 మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నారని వాటి సంరక్షించే బాధ్యతను కళాశాల తీసుకుంటున్న నేపథ్యంలో ఇదే ప్రాంగణంలో ఉన్న తాము కూడా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాను హరిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారులు రామకృష్ణ, బిఎన్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ 1950 నుండి వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి 33 శాతం అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రాథమిక హక్కుగా స్వీకరించాలన్నారు. అటవీ నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచామని అవసరమైన వారు కావాల్సినన్ని మొక్కలు తీసుకొని నాటాలన్నారు. భారత ప్రధాని ఒక చెట్టు తల్లి పేరుతో నాటాలన్న నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. అటవీ సంపద, చెట్లను సంరక్షిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని వారు తెలిపారు.

అంతకుముందు రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ మెడికల్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు రాజా, వెంకటేశ్వర, విజయనికేతన్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, సుగాలి మెట్ట, ఎల్ కె తాండ సుగాలి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ 75వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి, సబ్ డిఎఫ్ఓ, సూర్యచంద్రరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ప్రవీణ్ కుమార్, సుబ్బరాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580262
Total Users : 47946