ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వలన సంభవించిన నష్టనివారణకు యుద్ధప్రతిపాదిక చర్యలు చేపట్టాలి : పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ డిమాండ్

కర్నూలు :
రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ఊర్లు ఏర్లు అన్ని ఏకమై వేలాది గ్రామాలు జలదిగ్బంధనానికి గురైందన్నారు.సోమవారంనాడు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల్లోనే 28.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదయిందన్నారు. ఇప్పటికి వరకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం 15 మంది వరదల్లో చిక్కుకొని మృతి చెందారు. అనేకమంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియ రావడం లేదు. రోడ్లు, రైల్వే లైన్లు ధ్వంసమై రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్లు బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారుని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ వర్ష బీభత్సం వలన వ్యవసాయ రంగం కుదేలైంది. రాష్ట్రంలో భారీ పంట నష్టం సంభవించింది పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి ,రాష్ట్రవ్యాప్తంగా చెరువులు తెగిపోయాయి.వేలాది ఎకరాల పంటభూములు కోతకు గురవటంతో పాటు పొలాల్లో ఇసుక మేటలు పెట్టి సేద్యానికి పనికి రాకుండా పోయాయన్నారు. ప్రధానంగా గుంటూరు, బాపట్ల, ప్రకాశం, విజయవాడ, కృష్ణ జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ,లాంటి జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ప్రకృతి విపత్తుగా పరిగణించి యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టాలని ,ఇతర ప్రాంతాల ప్రజలు నీట మునుగిన ప్రాంతాలకు తిండి , బట్టలు ,సురక్షితమైన ప్రాంతాలకుచెర్చడం కోసం కృషి చెయ్యాలని , ఆర్థికంగా ఆదుకుని సహాయం అందచేసి మానవత్వం చాటుకోవాలి అని పి డి ఎస్ యు ప్రజలను కోరుతున్నది.
డిమాండ్స్
🔸కర్నూలు జిల్లాలో అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి,ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి.కర్నూలు జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా సహాయక చర్యలు చేపట్టి,ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అత్యవసర వైద్యవిభాగాన్ని అందరికి అందుబాటులో ఉంచాలి.
🔸 వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలి.పశువులు, కోళ్లు కోల్పోయిన వారి నష్టానికి తగిన పరిహారం అందించి ఆదుకోవాలి.
🔸తెగిపోయిన చెరువులు కుంటలను గండ్లు పడిన కాలువలను వెంటనే మరమ్మతులు చేయించాలి.
🔸నష్టపోయిన పంటల వివరాలను రికార్డు చేసి తగిన నష్టపరిహారాన్ని అందించాలి.
🔸వరద కోతకుగురైన,ఇసుక మేటలు వేసిన భూములు సాగులోకి తెచ్చుకొనేందుకు ఆర్థిక సహకారం అందించాలి.
🔸 రాష్ట్రంలో తక్షణమే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలి.
🔸 ఇంకా వర్షం ఉండడంతో వరదలను నివారించేందుకు ముందస్తుగానే తగిన సహాయక చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక