ఆంధ్రప్రదేశ్
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి.సిపిఐ

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి.సిపిఐ
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి.
2024 సెప్టెంబర్ 1 నుండి 6 వరకు
సి.పి.ఐ. దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయండి. సిపిఐ
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి అని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 నుండి 6 వరకు సి.పి.ఐ. దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయాలని స్థానిక సిపిఐ కార్యాలయంలో వాల్ పోస్టుర్ల ను విడుదల చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు. నరసింహలు, హరినాథ్, మహిళా సమాఖ్య నాయకురాలు సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ
దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయని . బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులతోపాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి అన్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు దీనికితోడు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచింది. పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారుతోందని అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయి అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కేవలం నాసిరకం బియ్యం పంపిణీతో సరిపెట్టేస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కేవలం కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన సాగిస్తోందే తప్ప ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం ప్రయత్నించక పోవడం కొత్త రేషన్ కా ర్డుల మంజూరుకు జనాభా లెక్కలతో ముడి పెడుతూ, మరోపక్క కార్డుదారులు మరోసారి ఆధారాలు చూపి రేషన్ కార్డులు పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు పెడుతూ రేషన్ కార్డులు కుదించే యోచనలో ప్రభుత్వాలున్నాయని అన్నారు .దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరు చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయని తెలిపారు. పేదరిక నిర్మూలనతోపాటు ప్రజలకు పౌష్టిక ఆహారం అందించే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకునేందుకు చూస్తున్నాయని తెలిపారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 8-9 మధ్య వుంటే నేడు 3-4 మధ్యకు పడిపోయింది. 2011 జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 80.48 కోట్ల రేషన్ కార్డులుండగా, మన రాష్ట్రంలో అంత్యోదయ కార్డులతో కలిపి 89.25 లక్షల రేషన్ కార్డులు న్నాయని తెలిపారు. 2024 నాటికి దేశంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నవారు 13 కోట్లకుపైగా వున్నారు న్నారు. దీనినిబట్టి దేశంలో దాదాపు 95 కోట్లమంది దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికితోడు ప్రపంచ ఆహార సూచికలో భారతదేశం 129 స్థానంలో వుండడం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోందని అన్నారు.
దేశవ్యాప్తంగా జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న అధిక ధరలను అరికట్టి, పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) జాతీయ సమితి పిలుపులో భాగంగా 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సి.పి.ఐ. ప్రజాందోళనలను నిర్వహించనుంది. ఈ ఆందోళనలలో యావన్మంది ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక