ఆంధ్రప్రదేశ్
నాణ్యమైన ఆహార పదార్థాలు విద్యార్థులకు ఇవ్వండి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకం ద్వారా పాఠశాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వడ్డించే ఆహార పదార్థాలు మొక్కుబడి రీతిలో గాకుండా నాణ్యతతో అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వంట ఏజెన్సీలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథక అమలులో సాంఘిక సంక్షేమ శాఖాధికారి చింతామణి, డీఈఓ సుధాకర్ రెడ్డి, పీడియాట్రిషన్, న్యూట్రిషన్ డాక్టర్లు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సెక్రటరీలు, వంట ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకం కింద నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని వంట ఏజెన్సీలను ఆదేశించారు. రోజు వారి మెనూ, మన జిల్లాలోని ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అందరి అభిప్రాయాలను తీసుకొని వాటిలోని మార్పులు చేర్పులపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
సంక్షేమ హాస్టల్లో పిల్లలకు వడ్డించే అన్నం మొక్కుబడి రీతిలో మెత్తగా, గట్టిగా వండకుండా సరైన పరిమాణంలో అన్నం వండితే పిల్లలకు కడుపు నొప్పి సమస్య రాదని కలెక్టర్ తెలిపారు. కోడిగుడ్డు, రాగి జావా లేదా ముద్ద, స్వీట్ పొంగల్ తదితర పోషక పదార్థాలు పిల్లలు ఏ విధంగా ఇష్టపడతారో ఆ రీతిలో వంట చేసేందుకు సిద్ధమై పిల్లలకు ఇచ్చేందుకు శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోషక విలువలు ఉన్న ఆకుకూరలు, కూరగాయలతో పప్పు, కర్రీ, సాంబారు తదితర ఆహార పదార్థాలు తయారుచేసి వేడివేడిగా ఇచ్చే పరిస్థితికి రావాలన్నారు. ప్రభుత్వ .మెను ప్రకారం ఏ రోజు ఏ ఆహార పదార్థాలు వండాలి. కూరగాయలు, చెట్నీ కాంబినేషన్ తో సహా వంట చేసే విధానంపై కూడా నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
డొక్కా సీతమ్మ గారి గొప్పతనం వివరిస్తూ శుభ్రమైన భోజనం ఏర్పాటు, వంటశాల పరిశుభ్రత, భోజనశాల పరిశుభ్రత మరియు బియ్యం మొదలగు వంట సామాన్లు భద్రపరిచే స్థలం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.రుచికరమైన భోజనము, పరిశుభ్రత, మంచి అలవాట్లే విద్యార్థులందరూ మధ్యాహ్నం బడి భోజనం తినేలా చేస్తాయని కలెక్టర్ తెలిపారు. పాఠశాల సామాన్య శాస్త్ర ఉపాధ్యాయులు చొరవ తీసుకొని, చేతిని శుభ్రపరచే పద్ధతులు మరియు మరుగుదొడ్లను ఉపయోగించే విధానాలను నేర్పించాలని అలాగే విద్యార్థులకు న్యూట్రిషన్ గార్డెన్ పెంపొందించడంలో వారి సహాయ సహకారాలు అందిస్తూ, విద్యార్థులు ఐక్యతను చాటించాలని పేర్కొన్నారు. తాను ప్రతి రోజు ఒక పాఠశాలను సందర్శించి ఎం.డి.ఎం ను స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక