Connect with us

ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో చేనేతలకు కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్

Published

on

ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో

వరద సాయం కింద 1455 చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ*

*ఒక్కోక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ*

*దింపుడుకళ్లెంలో సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజానా సింహ*

మంగళగిరి టౌన్, వరదలు కారణంగా మగ్గాలలోకి నీరు చేరి ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో బుధవారం బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంగళగిరి పట్టణంలోని దింపుడుకళ్లెంలో సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రారంభించారు. వరద సాయం కింద 1455 చేనేత కుటుంబాలకు గాను ఒక్కోక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంప, పంచదార పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ.. వరద సహాయక చర్యల్లో భాగంగా మంగళగిరిలో 1455 చేనేత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి పరిహారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ.. మంగళగిరిలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మగ్గాల్లోకి నీరు చేరి నష్ట చేకూరింది. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరి పట్టణంలో ప్రభుత్వ పరంగా చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ పాకెట్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కేజీ చొప్పున అందించడం జరిగింది. మొదటి మంత్రి నారా లోకేష్ చేనేతలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, ఎమ్మార్వో షేక్ మాబు సుభానీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షులు తోట పార్థసారథి, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకటమారుతీరావు, టీడీపీ పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్, బీజేపీ పట్టణ అధ్యక్షులు భాను ప్రకాష్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయిబ్రహ్మణ సాధికార సమితి కార్యవర్గ సభ్యులు మున్నంగి శివ శేషగిరిరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, 26వ వార్డు అధ్యక్షులు ఉద్దంటి గాంధీ, బంగారు లక్ష్మయ్య, పుట్లాబత్తుని లక్ష్మణరావు, మండ్రు రాము, గంధి చంద్రశేఖర్, ఉద్దంటి పద్మావతి, నాగరాజు, కాట్రు రవి, వెలుగోటి అన్నపూర్ణ, ఆకురాతి జయలక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580126
Total Users : 47810