ఆంధ్రప్రదేశ్
వార్షిక రుణ ప్రణాళిక కింద 12,828 కోట్లు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల
రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్.
పంట రుణాలకు సంబంధించి 5,366 కోట్ల రుణాల లక్ష్యం.
జిల్లాలో జిల్లాలో 2024 25 వార్షిక రుణాల ప్రణాళిక కింద వివిధ బ్యాంకుల ద్వారా 12,828 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధ్యక్షతన బ్యాంకర్ల సమన్వయ సమావేశం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ పి నరసింహారావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగప్రవీణ్, డిసిసి బ్యాంక్ సీఈవో విజయ్ కుమార్, ఎల్ డి ఎం రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక కింద 12,828 కోట్లు కేటాయించామని ఇందుకు సంబంధించి బ్యాంకులవారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని బ్యాంకర్లను సూచించారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి 5,366 కోట్లు, టర్మ్ లోన్లకు 2,503 కోట్లు, చిన్న, మధ్యతర పరిశ్రమలకు 1400 కోట్లు, గృహ నిర్మాణాలకు 567 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు 394 కోట్లు ఇతర ప్రాధాన్యతర రంగాలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకర్లు సహకరించాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. అలాగే టిడ్కో కింద లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించామని మరింత చేయూతనిచ్చి రుణాల మంజూరుకు సహకరించాలని బ్యాంకర్లను సూచించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద నిర్దేశించిన రుణాలను మంజూరు చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు రుణాల కింద 130 కోట్లు మంజూరు చేశారని దాదాపు 30 వేల మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్వో ఎఫ్ఆర్ కింద సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రుణాలు మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారులను బ్యాంకుల చుట్టూ తిప్పుకొని వారి సహనాన్ని పరీక్షించకుండా అవసరమైన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను సూచించారు. మన జిల్లాలో అధిక వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో నంద్యాల జిల్లా 20వ స్థానంలో ఉందని ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకొని ప్రతి ఏడాది 15% వృద్ధిరేటుతో ముందుకు వెళ్లాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ జిల్లా స్థాయిలోని వనరులను ప్రమోట్ చేస్తూ నిరుపేదల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో జనాభాకు తగ్గట్టు బ్యాంకులు, ఏటీఎంలు లేవని వాటిని పెంచేందుకు బ్యాంకర్లు ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యా విషయక అడ్వాన్సులు తక్కువ మొత్తంలో ఇస్తున్నారని విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యా రుణాలు అధిక సంఖ్యలో ప్రమోట్ చేయాలని బ్యాంకరులను కోరారు.
పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ ముద్ర లోన్ ల విషయమే తెలియదని బ్యాంకర్లు చెప్తున్నారని ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ముద్ర లోన్లను నిరుపేదలందరికీ ఇవ్వాలన్నారు. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య మాట్లాడుతూ కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు రుణాలు రిషెడ్యూల్ చేస్తూ కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, పరిశ్రమల జిఎం శ్రీనివాస యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక